BJP : బీజేపీ అంటే ఒకప్పుడు సిద్దాంతాలకు, నీతికి పెట్టింది పేరు అనేలా ఉండేది. దానికి కారణం అప్పట్లో వాజ్ పేయ్, అదాని లాంటి వారు నడిపించిన తీరు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ విధానాలను చూస్తుంటే గతంలో వాజయ్ పేయ్ ను ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. 1999లో వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు అన్నీ కలిసి అవివ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి. ఆ సమయంలో వాజ్ పేయ్ ప్రభుత్వం ఒక్క ఓటుతో అధికారం కోల్పోయింది. ఆ సమయంలో చాలా మంది నేతలు వాజ్ పేయ్ ను కలిశారు.
ఆ ఒక్క ఓటు ఏదో ఒక విధంగా సాదిద్దాం అంటూ తెలిపారు. కానీ వాజ్ పేయ్ ఒప్పుకోలేదు. ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు వెళ్దామని చెప్పి అధికారాన్ని కోల్పోయారు. అందుకే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించారు. దాంతో ప్రధానిగా మరోసారి వాజ్ పేయ్ మరోసారి పగ్గాలు చేపట్టారు. అలాంటి నిజాయితీ కలిగిన వాజ్ పేయ్ కాలం నాటి నేతలు ఇప్పుడు బీజేపీలో ఉన్నారా అంటే డౌటే అని చెప్పుకోవాలి. ఉదాహరణకు ఏపీ వరకు చూసుకుంటే మోడీ 2019 ఎన్నికల్లో చంద్రబాబును దారుణంగా విమర్శించారు. పోలవరం డబ్బులను ఏటీఎంలా వాడుకున్నారంటూ ఆరోపించారు. అంతే కాకుండా చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని చెప్పుకొచ్చారు. వారసత్వ రాజకీయాలను బొంద పెట్టాలని చెప్పుకొచ్చారు. దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా మోడీ, అమిత్ షా చెప్పే మాటలు ఇవే. కానీ ఏపీకి వచ్చేసరికి వాటిని తుంగలో తొక్కేశారు. ఒకప్పుడు అవినీతి పరుడు అని ముద్ర వేసిన చంద్రబాబుతోనే ఇప్పుడు మోడీ పొత్తులు పెట్టుకున్నారు.
అంతే కాకుండా చంద్రబాబు, లోకేష్ వారసత్వంతో నడుస్తున్న టీడీపీకి ఓట్లేయాలంటూ చెప్పడం ఇక్కడ ఇంకా విడ్డూరం. అది కూడా లోకేష్ ను ప్రేమగా మాట్లాడటం ఇంకా విచిత్రం అనే చెప్పుకోవాలేమో. ఒకప్పుడు ఇలాంటి మాటలు చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు జై కొట్టడం ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు బీజేపీ జాతీయ నేతలుగా చెప్పుకునే ప్రధాని మోడీకి, అమిత్ షాకు పెద్దగా విలువలు ఉండవనే అర్థం కదా అంటున్నారు ప్రతిపక్ష నేతలు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.