Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి...!
Tirumala : ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన రాజకీయంగా హీట్ పెంచింది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తుండటంతో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. టీటీడీ కూడా నిబంధనల ప్రకారం.. శ్రీవారి దర్శనం కోసం వచ్చే అన్యమతస్థుల నుంచి డిక్లరేషన్ కోరినట్లే మాజీ సీఎం జగన్ నుంచీ తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి హిందూ మతాన్ని ఆచరించే వారికి ఎలాంటి ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. అయితే అన్యమతస్తులు ఎవరైనా తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలంటే వారు తమ వివరాల్ని పేర్కొంటూ డిక్లరేషన్ ఫారం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. నిజానికి ఇలాంటి తీరు ఒక్క తిరుమలలోనే కాదు. ఏ మతానికైనా ఉంటుంది. అన్య మతస్తులు తమ ప్రార్థనాలయాల్లోకి ప్రవేశించేందుకు పరిమితులు ఉంటాయి. తాము సదరు మతాన్ని, వారి విశ్వాసాల్ని విశ్వసిస్తామన్న ప్రమాణాన్ని చేయాల్సి ఉంటుంది.
అదే రీతిలో తిరుమలలో కూడా అలాంటి విధానాన్నే ఫాలో అవుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల ప్రకారం అన్యమతస్తులు ఎవరైనా సరే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందు తమకు తాము స్వచ్ఛదంగా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని దేవాదాయ శాఖ చట్టంలోని 30/1987ను అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది.దీని ప్రకారం హిందువులు కాని అన్యమస్తులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవాలంటే ఆలయంలోకి వెళ్లటానికి ముందే హిందూ మతాన్ని.. విశ్వాసాల్ని విశ్వసిస్తానంటూ డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి చెందిన వ్యక్తినని.. అయినప్పటికీ శ్రీవేంకటేశ్వరస్వామిపై తనకు నమ్మకం.. గౌరవం ఉన్నాయని. అందుకే దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ తమ వివరాల్ని నమోదు చేసి.. సంతకం పెట్టి టీటీడీకి ఇవ్వాల్సి ఉంటుంది.
తిరుమలకు అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలని టీటీడీ నిబంధనలు చెబుతున్నాయి. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను తీసుకొచ్చింది. ఈ నిబంధనను అనుసరించి హిందువులు కాని వ్యక్తులు/అన్యమతస్థులు.. తిరుమల శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్ ఫారంపై సంతకం పెట్టాల్సి ఉంటుంది. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని.. అయినా శ్రీవేంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనానికి అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి, సంతకం చేయాల్సి ఉంటుంది. గతంలో సోనియా గాంధీ, ఏపీజే అబ్దుల్ కలాంతో పాటూ పలువురు ప్రముఖులు సైతం డిక్లరేషన్ సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
Tirumala : తిరుమల డిక్లరేషన్ అంటే ఏమిటి.. టీటీడీ నిబంధనలు ఏం చెబుతున్నాయి…!
తిరుమల వచ్చే అన్యమతస్థుల్లో సామాన్య భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు 17వ కంపార్ట్మెంటు దగ్గర డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. వీఐపీలు వచ్చినప్పుడు అధికారులే గెస్ట్హౌస్ దగ్గరకు వెళ్లి సంతకాలు తీసుకుంటారు. జగన్ శుక్రవారం తిరుమల వస్తే గెస్ట్హౌస్ దగ్గరకు వెళ్లి టీటీడీ నిబంధనలు, దేవాదాయశాఖ చట్టంలోని అంశాలను ఆయనకు వివరించి డిక్లరేషన్పై సంతకం కోరనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆసక్తికరంగా మారింది.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.