
Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
Warangal Airport : వరంగల్లో మామనూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ గేమ్ మొదలైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఈ ఎయిర్ పోర్టును కొచ్చి ఎయిర్ పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా తెలంగాణలో విమానయాన సేవలు మరింత విస్తరించనున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించి ఎవరి కృషి ఎక్కువ? ఎవరికి ఘనత దక్కాలి? అనే విషయంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు పరస్పర విమర్శలతో మాటల యుద్ధం మొదలుపెట్టాయి.
Warangal Airport : వరంగల్ ఎయిర్ పోర్టు క్రిడెట్ ఏ పార్టీకి దక్కుతుంది..?
కేంద్రం అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మామనూరు ఎయిర్ స్ట్రిప్ వద్ద సంబరాలు చేసుకున్నారు. దీంతో ఒకరిదంటే ఒకరికి ఘనత తీసిపోకుండా పోటీ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తానే ఎంతో కష్టపడి కేంద్రమంత్రులను ఒప్పించి, భూసేకరణ నిధులు కేటాయించి, ఎయిర్ పోర్టును తెచ్చానని ప్రకటించారు. అయితే బీజేపీ నేత కిషన్ రెడ్డి దీనిని తిప్పికొడుతూ, ఈ ప్రాజెక్ట్ పూర్తిగా తమ కృషి వల్లే సాధ్యమైందని ప్రచారం మొదలుపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ నేతలు “ఏదైనా అభివృద్ధి జరిగితే అది కిషన్ రెడ్డి కృషి, లేదంటే రేవంత్ వైఫల్యమే” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ నేతలు మరో వాదనను ముందుకు తెస్తున్నారు. తామే మొదట వరంగల్ ఎయిర్ పోర్టు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చామని, అనుమతుల కోసం ఎంతగానో కృషి చేశామని చెప్పుకొస్తున్నారు. అయితే గతంలోనే కేంద్రం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణలో సహకరించలేదని మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వాదనలతో బీఆర్ఎస్ మౌనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వరంగల్ ఎయిర్ పోర్టు నిర్మాణం స్థానిక ప్రజల చిరకాల స్వప్నం. రాజకీయ పార్టీలు ఎవరి కృషి ఎక్కువ అనే విషయంపై వాదనలు చేయడం కంటే, ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికార, విపక్ష పార్టీలు పరస్పర విమర్శలకు కాకుండా, నిర్మాణ పనుల కోసం కలిసి పనిచేయడం మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక విలక్షణమైన శైలిని అనుసరిస్తారు. రాజకీయాల్లో ఎవరి…
Allu Arjun : భారతీయ సినిమా మార్కెట్ ఇప్పుడు వందల కోట్ల నుండి వేల కోట్ల రూపాయలకు విస్తరించింది. ఈ…
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
This website uses cookies.