Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఎమ్మెల్సీ పట్టబద్రుల స్థానంకు సంబంధించిన ఎన్నికలకు సర్వ సిద్దం అయ్యింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం లో టీఆర్ఎస్ మరియు బీజేపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. బీజేపీకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఏకంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణిదేవిని రంగంలోకి దించడం జరిగింది. ఆమె ఎంపికతో బీజేపీ పై టీఆర్ఎస్ సగం గెలిచినట్లయ్యింది. కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ శాతం మంది ఆమెకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఇక హరీష్ రావును రంగంలోకి దించడం వల్ల ఆ ఎమ్మెల్సీ స్థానంను టీఆర్ఎస్ ఈజీగానే గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. హరీష్ రావుపై సానుభూతితో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ సురభి కి ఓట్లు వేసే అవకాశం ఉందంటున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యుడిగా హరీష్ రావు వ్యవహరించిన విషయం తెల్సిందే. ఆ ఉప ఎన్నికల్లో ఓటమి కారణంగా పార్టీలో హరీష్ రావు ప్రభావం తగ్గినట్లుగా ఉంది. అందుకే ఆయన ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు చాలా గట్టిగా ఆదేశాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థి గెలుపు కోసం పాటు పడాలని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోతే తన రాజకీయ భవితవ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని ఈ సందర్బంగా పార్టీ నాయకులతో ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తోంది. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో హరీష్ రావపై కాస్త సానుభూతి అయితే పెరిగింది.
గ్రాడ్యుయేట్లు ఎక్కువగా నిరుద్యోగులు ఉన్నారు. కనుక వారి నుండి టీఆర్ఎస్ కు ఎంత వరకు ఓట్లు వస్తాయి అంటే అనుమానమే అన్నట్లుగా స్వయంగా ఆపార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పుడు హరీష్ రావు వైపు చూస్తున్నారు. హరీష్ రావు మొహం చూసి గ్రాడ్యుయేట్స్ ఈ ఒక్కసారికి ఓట్లు వేసే అవకాశం ఉందని ఆయన వైపే వారు ఉంటారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా హరీష్ రావు చేస్తున్న పనులు మరియు ఆయన ప్రచారంతో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక వేళ ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు పార్టీకి మరింత దూరం అవ్వడం ఖాయం, దాంతో కేటీఆర్ కు పోటీ పూర్తిగా తగ్గే అవకాశం ఉందని కేసీఆర్ భావిస్తున్నాడట.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.