BJP : బీజేపీ తీరు టీడీపీ కి నచ్చడం లేదా.. ఏపీలో ఈ రకంగా పట్టు పెంచుకుంటుందా..?
BJP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడినప్పటికీ, మూడు పార్టీలు తమ తమ బలం పెంచుకునే వ్యూహాత్మక కదలికలతో ముందుకెళ్తున్నాయి. ఇందులో బీజేపీ మాత్రం ప్రత్యేకంగా నాయకత్వ ధోరణిలో వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి ఉదారంగా సాయం అందిస్తూ, రాజకీయంగా మాత్రం పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాలు, ముఖ్యంగా రాజ్యసభ నియామకాల్లో బీజేపీ చూపిన ధోరణి టీడీపీ కేడర్లో ఆగ్రహానికి కారణమవుతోంది.

BJP : బీజేపీ తీరు టీడీపీ కి నచ్చడం లేదా.. ఏపీలో ఈ రకంగా పట్టు పెంచుకుంటుందా..?
BJP : బిజెపి పై టీడీపీ గరం గరం గా ఉందా..?
రాజకీయంగా చిన్న భాగస్వామిగా ఉన్నప్పటికీ, బీజేపీ ఏపీలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రానికి కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ, బీజేపీకి ఇప్పటికీ రెండు రాజ్యసభ స్థానాలు దక్కాయి. తాజాగా పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వ్యక్తులకు బీజేపీ ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఖండిస్తున్నారు. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ స్థానం, పాకా వెంకట సత్యనారాయణకు రాజ్యసభ సీటు ఇవ్వడం బీజేపీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య బీజేపీ తన పట్టు మరింత బలపర్చే దిశగా సాగుతోంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్నా, తాము తీసుకునే నిర్ణయాలకు మిత్రపక్షాలు వ్యతిరేకంగా ఉండలేని పరిస్థితులు సృష్టిస్తోంది. వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బయటకు రావడంతో రెండు సీట్లు టీడీపీకి, మరో రెండు బీజేపీకి కేటాయించడం గమనార్హం. జనసేనకు మాత్రం ఒక్క రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో, బీజేపీ రానున్న రోజుల్లో మరింత వ్యూహాత్మకంగా ముందుకెళ్లి రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.