YCP MLAs : రాయలసీమకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా వైసీపీకి వ్యతిరేకత అయిన ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరులో సీక్రెట్ మీటింగ్ పెట్టారంటూ టీడీపీ వర్గాలలో ఒక వార్త హల్ చల్ అవుతుంది. రానున్న 2024 ఎన్నికల్లో దాదాపు వై.యస్.జగన్మోహన్ రెడ్డికి 50 నుంచి 80 టికెట్లు సిట్టింగ్లకు ఇచ్చే ఛాన్స్ లేదని, ఇప్పటికే 11 చోట్ల టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి మీటింగులు చేస్తున్నారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే లు జగన్ ను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎందుకు టికెట్ ఇవ్వలేరు ఇవ్వకపోతే తాము ఎలాంటి బేరసారాలు అడగలమో,
రేపు అధికారంలోకి వచ్చాక వాళ్లకు ఎటువంటి హామీ ఇవ్వగలుగుతాం అనే దానిమీద మాట్లాడుతున్నారు. అయితే ఒక పక్క జగన్ తన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతూ ఉండగానే బెంగళూరులో ఒక వర్గం ఇప్పటికే 40 నుంచి 50 ఎమ్మెల్యేలు అక్కడ మీటింగ్ పెట్టుకుని వీళ్లంతా తెలుగుదేశం పార్టీలోకి వెళ్లాలని అనుకుంటున్నారని, టీడీపీ ఎక్కడెక్కడ టికెట్లు ఇస్తుంది అనేదాన్ని మీద క్లారిటీ ఉన్నవాళ్లు అధికారంలేకి టీడీపీనే రాబోతుందని, అందుకే టిడిపిలోకి వెళితే బెటర్ గా ఉంటుంది అని, అధికారం ఉంటే సరిపోతుంది అని, ఒకవేళ వైసీపీలోనే ఉండి ఉంటే వైసీపీ ఓడిపోతే అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కోల్పోయినట్లు అవుతుంది. అధికారంలోకి రాకపోతే గతంలో ఉన్న ఇల్లీగల్ కేసులు, తలనొప్పులు స్టార్ట్ అవుతాయని అనే కంగారులో రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీలో ఉన్నారని,
వీళ్లంతా మీటింగ్ పెట్టుకొని ఉన్నారని, టిడిపికి సంబంధించిన పాజిటివ్ మీడియా దీని గురించి న్యూస్ వైరల్ చేస్తుంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఒకవేళ వై.యస్.జగన్మోహన్ రెడ్డి 80 సిట్టింగ్ సీట్లు తీసేస్తే జరగబోయేది ఇదే అని అంటున్నారు. ఒక్కరు ఇద్దరినీ ఆపగలం 88 మందిని తీసేస్తే అది సహజంగా మారిపోతుంది. మారిన వాళ్లు సైలెంట్ గా ఉండరు వైసీపీకి ఓటు వేసిన వాళ్లంతా ఇప్పుడు టిడిపికి ఓటు వేయిస్తారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న లోసుగుల గురించి మాట్లాడుతారు. రాయలసీమకు చెందిన మంత్రి వైసిపి కి చెందిన ఎమ్మెల్యే ఈ మీటింగ్లో కీలక పాత్ర పోషించారంటూ వార్తలు వస్తున్నాయి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.