YS Jagan : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ప్రభుత్వంపై విరుచుకు పడ్డాడు. పంచాయితీ ఎన్నికల తీరు తెన్నుల గురించి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడిన చంద్రబాబు నాయుడు కాస్త ఓపిక పట్టి పార్టీని కాపాడుకుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నాడు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏండేది కేవలం రెండేళ్లు మాత్రమే అని, ఆతర్వాత జగన్ గద్దె దిగడంతో పాటు తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేయడం కూడా ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. రాబోయే రోజుల్లో తెలుగు దేశం పార్టీ ప్రతి గ్రామం కు కూడా రూ.5 కోట్ల నిధులు విడుదల చేయబోతుంది. ఆ నిధులతో మీరే గ్రామాల్లో అభివృద్ది పనులు చేయాలంటూ ఈ సందర్బంగా ఆయన అన్నాడు.
ఏపీలో అభివృద్ది జరగాలంటే కేవలం తెలుగు దేశం పార్టీతోనే సాధ్యం అంటూ ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు అన్నాడు. ప్రతి గ్రామంలో కూడా అయిదు సంవత్సరాకలు అయిదు కోట్ల చొప్పున విడుదల చేస్తూ అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తామని చంద్రబాబు నాయుడు అన్నాడు. అభివృద్ది కార్యక్రమాలను వదిలేసి వైకాపా కేవలం వారు దోచుకోవడమే సరిపోతుందని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంచాయితీ ఎన్నికల్లో బాగా పని చేసి తెలుగు దేశం పార్టీతోనే అభివృద్ది సాధ్యం అంటూ వారికి చెప్పాలని అప్పుడే ప్రజల్లో పార్టీ గురించి తెలుస్తుందని బాబు అన్నాడు.
ఏపీకి నిధులు తీసుకు రావడం మొదలుకుని రాష్ట్రంలో ప్రజల బాగోగులు చూసుకోవడం వరకు అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్ విషలం అయ్యాడు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటూ చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు సూచించాడు. పంచాయితీ ఎన్నికలను అస్సలు లైట్ తీసుకోవదంటూ ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా వర్క్ చేసి ఎక్కువ పంచాయితీలను గెలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో వారే గ్రామాల్లో తెలుగు దేశం పార్టీ గెలుపుకు కృషి చేస్తారంటూ చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.