YS Jagan : ఫుల్ పవర్స్ , గ్రీన్ సిగ్నల్ .. జగన్ విషయంలో కేంద్రం బిగ్ నిర్ణయం ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YS Jagan : ఫుల్ పవర్స్ , గ్రీన్ సిగ్నల్ .. జగన్ విషయంలో కేంద్రం బిగ్ నిర్ణయం !

YS Jagan : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ కేంద్రం దిగి వచ్చి మరీ ఏపీ అభివృద్ధి కోసం తనవంతు సాయం అందిస్తోంది. నిజానికి.. అదంతా ఊరికే జరిగింది కాదు. కేంద్ర ఊరికే ఏపీకి సాయం చేయడం లేదు. దాని వెనుక సీఎం జగన్ కృషి ఉంది. అవును.. రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఢిల్లీలో పోరాటం చేస్తూనే ఉంది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అవును.. ఎప్పటి […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 June 2023,7:00 pm

YS Jagan : ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల వేళ కేంద్రం దిగి వచ్చి మరీ ఏపీ అభివృద్ధి కోసం తనవంతు సాయం అందిస్తోంది. నిజానికి.. అదంతా ఊరికే జరిగింది కాదు. కేంద్ర ఊరికే ఏపీకి సాయం చేయడం లేదు. దాని వెనుక సీఎం జగన్ కృషి ఉంది. అవును.. రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఢిల్లీలో పోరాటం చేస్తూనే ఉంది. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. అవును.. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న రెవెన్యూ లోటు నిధులను తాజాగా కేంద్రం.. ఏపీకి విడుదల చేసింది. అంతే కాదు.. మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

నిజానికి.. పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ ప్రాజెక్ట్. దాన్ని నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రమే నిర్మించాలి కానీ.. గతంలో టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం పట్టించుకోలేదు. నిధులు కూడా మంజూరు చేయలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండటంతో జగన్ ప్రభుత్వం రాగానే  పోలవరం ప్రాజెక్ట్ నిధులు, నిర్మాణం విషయంపై సీఎం జగన్.. కేంద్రంతో గత నాలుగేళ్ల నుంచి పోరాడుతూనే ఉన్నారు. దానికి ఫలితంగానే తాజాగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్రం ఏకంగా రూ.12 వేల కోట్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

ys jagan govt gets rs 12 thousand crores for polavaram project

ys jagan govt gets rs 12 thousand crores for polavaram project

YS Jagan : రూ.12911 కోట్ల నిధులు విడుదల చేస్తూ కేంద్రం ఆమోదం

ప్రస్తుతం ఉన్న నిధులు కాకుండా.. అదనంగా మరో రూ.12,911 కోట్ల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదంతా సీఎం జగన్ కృషి. చాలా ఏళ్ల నుంచి పోలవరం ప్రాజెక్ట్ విషయమై కేంద్రంతో పోరాడుతున్నారు. ఎంతో కష్టపడి కేంద్రంతో పోరాడి చివరకు సాధించగలిగారు. ఈ పని చంద్రబాబు చేయలేకపోయారు. అందుకే ఆయన ఒక ఫెయిల్యూర్ సీఎంగా మిగిలిపోయారు.

Tags :

    kranthi

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది