
ys jagan mohan reddy
Ys Jagan : ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయమై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మరియు ప్రభుత్వంకు మద్య పెద్ద యుద్దమే జరిగినట్లయ్యింది. న్యాయ పోరాటాల వరకు కూడా వెళ్లారు. అయినా కూడా చివరకు ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ పై నిమ్మగడ్డ రమేష్ పై చేయి సాధించి పంచాయితీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపించాడు. ఈ విషయంలో నిమ్మగడ్డ విజయం సాధించినట్లే అంటూ జగన్ వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. ఎన్నికలకు భయపడి వైఎస్ జగన్ రకరకాలుగా జిమ్మిక్కులు చేశాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇక స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి నిమ్మగడ్డ రమేష్ ఓకే అన్నట్లుగానే అని అనూహ్యంగా మెలిక పెట్టాడు. ఈ విషయంలో వైఎస్ జగన్ కూడా మైండ్ బ్లాంక్ అయ్యేలా నిమ్మగడ్డ వ్యవహరించాడు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం సూచన మేరకు ఎక్కడ నిలిపేయడం జరిగిందో అక్కడ నుండి పునః ప్రారంభించేందుకు నిమ్మగడ్డ ఒప్పుకున్నాడు. గత ఏడాది మార్చిలో ఎన్నికల పక్రియ నామినేషన్ ఉపసంహరణకు ముందు నిలిచి పోయిన విషయం తెల్సిందే. నామినేషన్ ల గడువు పూర్తి అవ్వడంతో ఉపసంహరణ విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో నామినేషన్ లు వేయని కొందరు ఇప్పుడు నామినేషన్ వేసేందుకు అవకాశం అడుగుతున్నారు. అది ఎలా సాధ్యం అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. టెక్నికల్ గా అది సాధ్యం కాకపోవచ్చు అంటూ వైకాపా నాయకులు అంటూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఎందుకు సాధ్యం కాదు అంటూ నామినేషన్ లు వేసేందుకు అనుమతులు ఇచ్చాడు. దీంతో అప్పుడు ఎవరైతే నామినేషన్ వేయకుండా ఆగారో వారు ఇప్పుడు వేసే అవకాశం దక్కడంతో టీడీపీ ఫుల్ హ్యాపీ.
ys jagan mohan reddy
వైకాపా నాయకులు బెదిరించడం వల్ల గత మార్చిలో నామినేషన్ లు వేయలేక పోయాం అంటూ కొందరు టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ వారికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం పార్టీతో సహా అన్ని పార్టీలు కూడా ఆ స మయంలో నామినేషన్ వేసేందుకు ఎవరైనా అడ్డు వచ్చి ఉంటే ఆ విషయాన్ని సాక్ష్యాధారాలతో కలెక్టర్లకు చూపించి మళ్లీ నామినేషన్ వేసే అవకాశం ఉంది. గతంలో బెదిరింపులకు పాల్పడ్డ వైకాపా నాయకులు మళ్లీ బెదిరింపులకు పాల్పడకుండా తాము రక్షణ కల్పిస్తామని నిమ్మగడ్డ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ తెలుగు దేశం పార్టీ నాయకులు కొందరు నామినేషన్ వేసేందుకు సిద్దం అవుతున్నారు. మరి కలెక్టర్లు వారి నామినేషన్ లపై ఎలా స్పందిస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది.
Medak : మెదక్ జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన విద్యార్థి…
OTT Releases : మార్చి నెల వచ్చేసింది అంటే చాలు సినీ ప్రియులకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఫిబ్రవరి వరకు…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తోంది. గత ఐదేళ్లుగా…
Lunar Eclipse : 2026 సంవత్సరం మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం భక్తులకు, జ్యోతిష్య విశ్వాసాలను అనుసరించే వారికి ప్రత్యేక…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సాధించిన ఓటు…
Holi Festival : అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి సంతోషంగా జీవించాలనే ఐక్యతా భావాన్ని పంచే రంగుల పండుగ హోలీ…
BR Naidu Video : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు కర్మ సిద్ధాంతం చుట్టూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.…
Revanth Reddy : తెలంగాణ Telangana లో పరిపాలన వేగం పెంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Cm Revanth reddy…
Bangalore : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనానికి దారి తీసిన హత్యా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టెలివిజన్ రంగానికి…
Successful Farmer : చాలా మంది యువత ఉద్యోగాల కోసం మహానగరాల వైపు పరుగులు తీస్తుంటారు. స్థిరమైన జీతం, సౌకర్యవంతమైన…
IRCTC Agent : ఇంట్లో ఖాళీగా ఉంటూ అదనపు ఆదాయం సంపాదించాలని భావిస్తున్నారా? లేక తక్కువ పెట్టుబడితో పార్ట్ టైమ్…
LIC Bima Sakhi : స్వయంగా సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకునే మహిళల కోసం భారత ప్రభుత్వ రంగ బీమా…
This website uses cookies.