Ysrcp : వైసీపీ అతి ప్ర‌చార‌మే వారి కొంప ముంచ‌బోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ysrcp : వైసీపీ అతి ప్ర‌చార‌మే వారి కొంప ముంచ‌బోతుందా..?

Ysrcp : హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నిక‌ల‌లో గెలుపెవ‌రిది అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయ‌డం ఖాయమ‌ని వైసీపీ చెబుతుండ‌గా, ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 May 2024,4:30 pm

Ysrcp : హోరాహోరీగా సాగిన ఏపీ ఎన్నిక‌ల‌లో గెలుపెవ‌రిది అనే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు న‌డుస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఏపీలో మరోసారి అధికారం ఖాయమని వైసీపీ చెబుతోంది. జగన్ మరోసారి సీఎంగా ప్రమాణం చేయ‌డం ఖాయమ‌ని వైసీపీ చెబుతుండ‌గా, ఇందు కోసం వైసీపీ నేతలు విశాఖ కు వచ్చేందుకు హోటళ్లు బుక్ చేసుకున్నారు. విమాన, ప్రయివేటు బస్సు ఛార్జీలు రెట్టింపు అయ్యాయి. అసలు ఫలితాలు రాకుండానే వైసీపీ ఇంతలా ఎందుకు హంగామా చేస్తుంది. ఇది విశ్వసమా..అతి విశ్వాసమా..అసలు ఏంటి వైసీపీ నేతల ధీమా.

Ysrcp ఏం జ‌రుగుతుంది..!

ముందస్తుగా ఈ ప్రచారం ఎందుకు? గెలిచిన తర్వాత ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి? ఈ ముందస్తు హడావిడి ఏంటి? నిజంగా విశాఖలో ఆ పరిస్థితి ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీని గురించి చ‌ర్చ ఓ రేంజ్‌లో న‌డుస్తుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అది మొదలు.. అసలు విశాఖలో ఖాళీ ఉండదని.. నింగి, నేల అంతా వైసీపీ మయం అయిందని ప్రచారం ప్రారంభించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. హోట‌ల్ రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. ప్ర‌యాణానికి అంత ఇబ్బంది ఏమి లేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రచార ఆర్భాటం ప్రారంభించిందో.. రాష్ట్రవ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది.

Ysrcp వైసీపీ అతి ప్ర‌చార‌మే వారి కొంప ముంచ‌బోతుందా

Ysrcp : వైసీపీ అతి ప్ర‌చార‌మే వారి కొంప ముంచ‌బోతుందా..?

నిజంగా విశాఖలో హోటళ్లు దొరకడం లేదా? రైలు, బస్సుల టిక్కెట్లు దొరకడం లేదా? రిజర్వేషన్లు దొరకడం లేదా? అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. కానీ ఇలా ఆరా తీయక ముందే.. హోటల్లు, రిసార్టులు తమకు తాము ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురు ప్రకటనలు చేస్తున్నాయి. ఇక బస్సు సర్వీసులు అయితే.. జూన్ 9 నాటికి, అంతకుముందు నాటికి ఎక్కువ టికెట్లు ఖాళీగా చూపుతున్నాయి. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం అతి అని తెలుస్తోంది. అది మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తోంది. ఎన్నికల తరువాత ఐప్యాక్ టీంతో సమావేశం సమయంలో 2019 లో వచ్చిన 151 అసెంబ్లీ..22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేసారు. ఆ తరువాత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నెల 30న తిరిగి రానున్నారు. అయితే, పోలింగ్ సరళి చూసిన తరువాత వైసీపీ శ్రేణుల్లో నిజంగా జగన్ చెప్పినట్లుగా 151 కంటే ఎక్కువ సీట్లు సాధ్యమేనా అనే సందేహాలు మొదలయ్యాయి

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది