
#image_title
TDP – Janasena : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై వైసీపీపై టీడీపీ వాళ్లు ఫైర్ అవుతుంటే.. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అంతే కాదు.. ఒకరిని మరొకరు తిట్టుకోవడం కామన్ అయిపోయింది. తాజాగా వైసీపీ నాయకురాలు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీ వాళ్లకు మైండ్ దొబ్బిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల వాళ్లకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కానీ.. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కానీ లేదా? ఎక్కడో చంద్రబాబు తప్పులు చేసి దొరికిపోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి క్రిమినల్ గా పట్టుబడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తే ఆ తప్పులను వెనకేసుకొస్తూ జనాలు, ప్రతిపక్షాల వాళ్లు ఒక మెంటల్ డిజార్డర్ వచ్చిందేమో అనిపిస్తోంది. అసలు వాళ్లు ఏం మాట్లాడుతున్నారు.. ఏం చేస్తున్నారు.. పబ్లిక్ ను ఎటు తీసుకెళ్తున్నారు అనేది అర్థం కావడం లేదు అంటూ మండిపడ్డారు.
ఎన్నికల్లో ఎటూ కంటెస్ట్ చేయలేం.. రాలేం అని మీకు ముందే తెలిసిపోయిందా? భువనేశ్వరి, బ్రాహ్మణి ఖచ్చితంగా ఆలోచించాలి. లేడీస్ ను వెపన్స్ గా పెట్టుకొని సీఎం మీద, ఆయన కుటుంబం మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి భువనేశ్వరి. అసలు ఏం జరుగుతోంది. ఒకప్పుడు ఏదో ఒక చిన్న లెటర్ ను బేస్ చేసుకొని ఎలాంటి ఆధారాలు లేకుండా 16 నెలలు రిమాండ్ లో బంధించి నిర్దాక్షిణ్యంగా ఎన్నో సమస్యలు క్రియేట్ చేసినా జగన్ మోహన్ రెడ్డి ఏనాడూ తొణకలేదు. ఎవ్వరూ ఆయన వైపు మాట్లాడిన వారు లేరు. పబ్లిక్ ను కూడా ఏనాడూ డిస్టర్బ్ చేయలేదు. బయటికి వచ్చి ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రజా తీర్పు ద్వారా ప్రజల మనిషిగా పీఠాన్ని దక్కించుకున్నారు.. అన్నారు.
#image_title
ప్రతిపక్షాలు ధైర్యంగా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి నిరూపించుకోండి. అంతే కానీ.. రాజకీయాలకు సంబంధం లేని మాటలను మాట్లాడకండి. భువనేశ్వరి మీరు ఒక మహిళే కదా. సెంట్రల్ లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇచ్చి మహిళలను గౌరవిస్తున్నారు. చట్టసభల్లోకి మహిళలు రావాలని ఇదంతా చేస్తున్నారు. మరి కేంద్రంలోనే మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే.. మీరు ఎందుకు ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని ఇలా చేస్తున్నారు. ఈ గ్రాఫిక్స్ ఏంటి.. ఈ మార్పులు ఏంటి. మీరైనా సరే.. కొంచెం చొరవ తీసుకొని వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టండి. ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక టీడీపీ కాదు.. వైసీపీ కాదు.. జనసేన కాదు.. మహిళలకు సంబంధించింది.. మహిళలను ఎందుకు పావుగా వాడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఒక పక్క మన రాష్ట్రం గురించి దేశంలోనే ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.. అవన్నీ మీకు కనిపించడం లేదా? అంటూ ఆమె మండిపడ్డారు.
Raghav chadda : దేశంలో విమాన ప్రయాణం అంటే ఒకప్పుడు ధనికులకు మాత్రమే పరిమితం అనుకునేవారు కానీ ఇప్పుడు కాలం…
April Fools Day : ఏప్రిల్ 1 వచ్చిందంటే చాలు... స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆఫీసులో తోటి ఉద్యోగులు ఒకరినొకరు…
Telangana Chicken Shops Strike : మాంసాహార ప్రియులకు, ముఖ్యంగా చికెన్ అంటే ప్రాణం పెట్టే తెలంగాణ వాసులకు ఇది…
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా…
Gold Silver Rate April 1st 2026 : పసిడి ప్రియులకు, సామాన్య కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ నుంచి వరుస…
Karthika Deepam 2 April 1st 2026 Episode : బుల్లితెరపై విశేష ఆదరణ పొందుతున్న 'కార్తీక దీపం 2'…
Hot Water : సాధారణంగా వేసవి కాలం రాగానే అందరూ చల్లటి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడతారు. కానీ ఎండలు…
Aloe Vera Juice : వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కలబంద రసం ఒక అద్భుతమైన…
Fennel Seeds : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది కడుపు ఉబ్బరం మరియు గ్యాస్…
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
This website uses cookies.