Gurumurthi తిరుపతి ఉప ఎన్నిక రసవత్తరంగా సాగుతోంది. సిట్టింగ్ ఎంపీ స్థానంను దక్కించుకునేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండ్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటే మరో వైపు బీజేపీ మరియు తెలుగు దేశం పార్టీలు ఆ స్థానంలో జెండా పాతేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచించి ఆ సీటును డాక్టర్ గురుమూర్తికి ఇవ్వడం జరిగింది. ఒక సాదారణ డాక్టర్ అయిన గురు మూర్తి మొదటి నుండి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చాడు.
ఆ కారణంగా సీటు ఇవ్వడం జరిగిందని అంతా అంటున్నారు. గురుమూర్తి విజయం ఖాయం కాని మెజార్టీ భారీగా ఉండాలని వైకాపా నాయకులను ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించాడు.మెజార్టీతో వైకాపా బలంను ప్రతిపక్షాలకు తెలియజేయడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా తమ బలంను నిరూపించుకోవాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకుని తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీకి వైకాపా సిద్దం అయ్యారు. గురుమూర్తి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేందుకు గాను నామినేషన్ ను తాజాగా దాఖలు చేశారు.
ఆ సమయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల అనుసారంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలిందా అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. ఏడుగురు మంత్రులు 15 మంది ఎమ్మెల్యేలు ముఖ్య వైకాపా నాయకులు ఇంకా వేలాది మంది కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు గురుమూర్తి సన్నిహితులు బంధువులు నామినేషన్ కార్యక్రమం ముందు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.ఇక గురుమూర్తి నామినేషన్ వేసిన గడియ చాలా బలమైనదిగా పురోహితులు చెబుతున్నారు. వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంతో పౌర్ణమి పూర్తి అయిన తర్వాత ఉదయం 11 గంటల సమయంలో సరిగ్గా రిటర్నింగ్ అధికారికి గురుమూర్తి నామినేషన్ ఇవ్వడం జరిగింది.
చాలా సెంటిమెంట్ తో అనేక రకాల అనుమానాలు మరియు అనేక రకాల సలహాలు సూచనలతో వైకాపా అధికారులు మూడు రోజుల క్రితం వేయాల్సిన నామినేషన్ ను తాజాగా వేయించారు. ఇంత బ్రహ్మ ముహూర్తంలో వేయడం వల్ల రికార్డు బ్రేకింగ్ మెజార్టీ రావాల్సిందే అంటూ వైకాపా నాయకులు ధీమాగా ఉన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.