kethireddy venkatarami reddy : రాష్ట్ర రాజకీయాల్లో రాయలసీమ రాజకీయం వేరు అన్నట్లుగా ఉంటుంది. అక్కడ ఇంతకు ముందు మాదిరిగా కొట్టుకోవడం నరుక్కోవడం లేదు. కాని ఆ రేంజ్ లోనే రాజకీయాలు జరుగుతాయి అనడంలో సందేహం లేదు. రాయలసీమ లో పరిటాల రవి తర్వాత ఆ రేంజ్ నాయకుడు మళ్లీ ఎదగలేదు అంటూ ఆయన అభిమానులు అనుకుంటూ ఉంటారు. మళ్లీ అంతటి స్థాయిని ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పరిటాల రవి చనిపోయిన తర్వాత నియోజక వర్గంలో ప్రాభవంను కాపాడుకుంటూ పరిటాల సునీత వచ్చారు.
ఇప్పుడు ఆమె తనయుడు పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్ అక్కడ సత్తా చాటేందుకు సిద్దం అయ్యాడు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆయనకు రాప్తాడు మరియు ధర్మవరం నియోజక వర్గాల బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు అప్పగించిన విషయం తెల్సిందే.చంద్రబాబు నాయుడు ఆ బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుండి కూడా పరిటాల శ్రీరామ్ రెండు నియోజక వర్గాల్లో తనదైన ముద్రను వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతను పరిటాల శ్రీరామ్ నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు అనడంలో కూడా సందేహం లేదు.
రాప్తాడు విషయం పక్కన పెడితే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సందడి ఎక్కువ అయ్యింది. అక్కడ వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ప్రజల్లోకి దూసుకు పోతు సొంత ఇమేజ్ ను సొంతం చేసుకుంటూ సోషల్ మీడియాలో మంచి పేరును దక్కించుకున్నాడు. న్యూట్రల్ గా ఉన్న వారిని మాత్రమే కాకుండా తెలుగు దేశం పార్టీలో ఉన్న కింది స్థాయి వారిని కూడా ఆకర్షించే విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటున్నాడు.కేతిరెడ్డిని దెబ్బ తీసేందుకు పరిటాల శ్రీరామ్ విమర్శల మీద విమర్శలు చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న యాత్ర మొత్తం బూటకం అంటున్నారు.
ఆయన అధికారులను హడావుడి చేసినంత మాత్రాన అక్కడ పనులు ఏమీ జరగడం లేదని పరిటాల శ్రీరామ్ ఆరోపిస్తున్నాడు. ఇటీవల ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ పర్యటించిన సమయంలో గొడవ జరిగింది. వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేశారు. దాంతో తెలుగు దేశం పార్టీ నాయకులు కూడా గొడవకు దిగారు. ఈ గొడవకు కారణం అంటూ పరిటాల శ్రీరామ్ పై కేసు నమోదు అయ్యింది. మొత్తానికి ధర్మవరంలో కేతిరెడ్డిపై పైచేయి సాధించేందుకు పరిటాల శ్రీరామ్ పడుతున్న కష్టం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.