
YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..!
YV Subbareddy : వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పార్టీపై జరుగుతున్న విమర్శలకు తీవ్రంగా స్పందించారు. ఇటీవల మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కోటరీ పాలన నడిచిందన్న మాటలపై స్పందించిన సుబ్బారెడ్డి, “పార్టీలో కోటరీ నడిపింది ఎవరో ఆయనకే బాగా తెలుసు” అంటూ నేరుగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
YV Subbareddy : పార్టీలో కోటరీ నడిపింది ఎవరో విజయసాయికి బాగా తెలుసు.. వైవీ సుబ్బారెడ్డి కౌంటర్..!
వైసీపీలో నెంబర్ 1, నెంబర్ 2 అనే స్థానాలు లేవని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, పార్టీ డెసిషన్స్ అన్నీ కలిసికట్టుగా తీసుకున్నవేనని తెలిపారు. వ్యక్తిగత కోణాల్లో విమర్శలు చేయడం అసహనంగా ఉందన్నారు. పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. లిక్కర్ కేసు పేరుతో చేయబడుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు.
“ఒక లిక్కర్ కేసు కాదు, మా పార్టీ నాయకులపై ఎన్నో కుట్ర కేసులు వేస్తున్నారు. ప్రజల్లో మద్దతు కోల్పోయిన రాజకీయ శక్తులు ఈ ప్రయోగాలు చేస్తున్నాయి” అని సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం వైసీపీ లో కనిపిస్తున్న అంతర్గత విభేదాలు రాజకీయంగా కీలక మలుపులు తేగలవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.