Virat Kohli : విరాట్ కోహ్లీ మెచ్యూరిటీ లేకుండా చేస్తున్నాడు అంటూ గౌతమ్ గంభీర్ చుర‌క‌

Authored By Sam C | The Telugu News | Updated on : 14 January 2022, 10:00 pm

Virat Kohli : ప్ర‌స్తుతం కేప్‌టౌన్ వేదిక‌గా భార‌త్-ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య మూడో టెస్ట్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 212 ప‌రుగుల ల‌క్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా టీం గెలుపుకి ద‌గ్గ‌ర‌గా ఉంది. అయితే గ్రౌండ్‌లో చాలా ఆవేశంగా ఉండే విరాట్ కోహ్లీ మూడో రోజు ఆటలో భాగంగా ప్రొటిస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ డీఆర్‌ఎస్‌ కాల్ పై చాలా ఆవేశంగా స్పందించాడు. ముఖ్యంగా కోహ్లి స్టంప్స్‌ మైక్‌ దగ్గరకు వెళ్లి.. ‘‘కేవలం ప్రత్యర్థి జట్టు మీదే కాదు. ముందు మీ జట్టు మీద దృష్టి సారించండి. అందరిపైనా ఫోకస్‌ పెట్టండి’’ అని వ్యాఖ్యానించడం విమర్శలకు తావిచ్చింది.

అంపైర్ అవుట్‌గా ప్రకటించిన తర్వాత బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను మిస్ అవుతున్నట్టు చూపించడంపై విరాట్ అండ్ టీమ్ అసహనం వ్యక్తం చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్ రవిచంద్రన్ అశ్విన్, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా స్టంప్ మైక్ దగ్గరికి వెళ్లి, థర్డ్ అంపైర్‌పై కామెంట్లతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ‘టెక్నాలజీ మన చేతుల్లో ఉండదు. ఎల్బీడబ్ల్యూలో నాటౌట్‌గా తేలిన డీన్ ఎల్గర్, ఆ తర్వాత క్యాచ్‌కి అవుట్ అయ్యాడు కదా.

Gautam Gambhir fire on Virat Kohli

Gautam Gambhir fire on Virat Kohli

Virat Kohli : కోహ్లీ ప్ర‌వ‌ర్త‌న‌పై విమ‌ర్శ‌లు

‘‘కోహ్లికి ఏమాత్రం పరిణతి లేదు. భారత జట్టు కెప్టెన్‌ స్టంప్స్‌ మైక్‌ వద్దకు వెళ్లి ఇలా చెప్పడం నిజంగా చెత్త విషయం. ఇలా చేయడం ద్వారా యువ క్రికెటర్లకు నువ్వు అస్సలు ఆదర్శవంతుడివి కాలేవు’’ అంటూ కోహ్లి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీమిండియాకి కెప్టెన్‌గా ఉంటూ ఇలా చిన్నపిల్లల్లా ఛీటింగ్ చేస్తున్నారని ఆరోపించడం జనాలకు నచ్చకపోవచ్చు….’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఇక దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు షాన్‌ పొలాక్‌ ఈ వివాదంపై స్పందిస్తూ.. వికెట్‌ తీయాలన్న కసితో ఉన్న టీమిండియాకు ఎల్గర్‌ డీఆర్‌ఎస్‌ కాల్‌తో తప్పించుకోవడం మింగుడుపడలేదని.. అందుకే ఆటగాళ్లు తీవ్ర నిరాశకు గురయ్యారని పేర్కొన్నాడు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp