India vs England T20 World Cup 2026 Semi Final : T20 వరల్డ్ కప్ 2026: ఇంగ్లాండ్పై భారత్ ఉత్కంఠ విజయం.. ఫైనల్లోకి టీమిండియా.. సంజూ శాంసన్ విశ్వరూపం
India vs England T20 World Cup 2026 Semi Final : టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ముంబైలోని వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్లో ఇంగ్లాండ్ను 7 పరుగుల తేడాతో ఓడించి టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్లో జరగనున్న తుది పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది.
India vs England T20 World Cup 2026 Semi Final : T20 వరల్డ్ కప్ 2026: ఇంగ్లాండ్పై భారత్ ఉత్కంఠ విజయం.. ఫైనల్లోకి టీమిండియా.. సంజూ శాంసన్ విశ్వరూపం
India vs England T20 World Cup 2026 Semi Final సంజూ శాంసన్ సునామీ: భారీ స్కోరు సాధించిన భారత్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆరంభంలోనే అభిషేక్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ Sanju Samson ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 89 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇషాన్ కిషన్ (39) తో కలిసి రెండో వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివర్లో శివమ్ దూబే (43), హార్దిక్ పాండ్యా (27), తిలక్ వర్మ (21) మెరుపులు మెరిపించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.
India vs England T20 World Cup 2026 Semi Final జాకబ్ బెథెల్ పోరాటం వృథా: ఉత్కంఠ రేపిన ఛేజింగ్
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. పవర్ప్లేలోనే కీలకమైన ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ వికెట్లను కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. కానీ, 22 ఏళ్ల యువ సంచలనం జాకబ్ బెథెల్ Jacob Bethell అద్భుత ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. బెథెల్ కేవలం 45 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసుకుని ఇంగ్లాండ్ను విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. బెథెల్ 105 పరుగులు (48 బంతుల్లో) చేసి చివరి ఓవర్లో రన్ అవుట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు తిరిగింది. ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి, కేవలం 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
మెరిసిన బుమ్రా, హార్దిక్.. ఆదుకున్న అక్షర్ పటేల్
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్ తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో రాణించగా.. అక్షర్ పటేల్ తన ఫీల్డింగ్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ను అక్షర్ అందుకున్న తీరు మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. చివరి ఓవర్లో 30 పరుగులు అవసరం కాగా, శివమ్ దూబే కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజూ శాంసన్
తన అద్భుత బ్యాటింగ్తో భారత్కు భారీ స్కోరు అందించిన సంజూ శాంసన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. వరుసగా రెండో మ్యాచ్లోనూ శాంసన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోవడం విశేషం.
ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత్, ఈసారి కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆదివారం జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడిస్తే భారత్ చరిత్ర సృష్టిస్తుంది.