IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :5 May 2025,3:00 pm

ప్రధానాంశాలు:

  •  IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో ప‌లు జ‌ట్లు రేసు నుండి త‌ప్పుకోగా, సన్ రైజర్స్ హైదరాబాద్ sunrisers hyderabad ఇంకా రేసులోనే ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన 4 మ్యాచ్‌ల్లో భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మిగిలిన 4 మ్యాచ్ ల్లోనూ నెగ్గితే 14 పాయింట్లు వ‌స్తాయి. అప్పుడు ఆర్సీబీ (16 పాయింట్లు), పంజాబ్ కింగ్స్ (15 పాయింట్లు)లు ప్లే ఆఫ్స్‌కు చేరతాయి. ముంబై, గుజరాత్ టైటాన్స్‌లు చెరో 14 పాయింట్లతో ఉన్నాయి.

IPL SRH ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా ఇది జ‌రిగితే సాధ్య‌మే

IPL SRH : ఎస్ఆర్ హెచ్ ప్లే ఆఫ్ చేర‌డం క‌ష్ట‌మేనా.. ఇది జ‌రిగితే సాధ్య‌మే!

IPL SRH  క‌ష్ట‌మే..

సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాలంటే ముంబై, గుజరాత్ జట్లలో ఒకటి మిగిలిన అన్ని మ్యాచ్ లను ఓడిపోవాల్సి ఉంటుంది. మరొకటి అన్ని మ్యాచ్ ల్లోనూ గెలవాల్సి ఉంటుంది. ఢిల్లీ ముంబైపై గెలిచి మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ ఓడాలి. ఇక కేకేఆర్ మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం 2 మ్యాచ్ ల్లో ఓడాలి. లక్నో విషయానికి వస్తే మిగిలిన 3 మ్యాచ్ ల్లోనూ ఓడాలి. లేదంటే కనీసం రెండు మ్యాచ్ ల్లోనూ ఓడాలి.

అప్పుడు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ లేదా ముంబై ఇండియన్స్ 14 కంటే ఎక్కువ పాయింట్లతో ఉంటాయి. ఇక ముంబై/గుజరాత్, ఢిల్లీ, సన్ రైజర్స్ జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ని ప‌రగ‌ణ‌లోకి తీసుకుంటారు. అప్పుడు సన్ రైజర్స్ తన నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకొని ఉంటే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది.ఇది లెక్క‌లు చెప్ప‌డానికి బాగానే ఉంది కాని సాధ్యం అయ్యే ప‌ని కాదు అంటున్నారు.

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది