IPL 2025 Postponed : బీసీసీఐ సంచలన నిర్ణయం.. వాయిదా పడ్డ ఐపీఎల్ 2025..!
ప్రధానాంశాలు:
IPL 2025 Postponed : బీసీసీఐ సంచలన నిర్ణయం.. వాయిదా పడ్డ ఐపీఎల్ 2025..!
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్-2025ను నిరవధికంగా వాయిదా వేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయించింది. అభిమానులు, ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

IPL 2025 Postponed : బీసీసీఐ సంచలన నిర్ణయం.. వాయిదా పడ్డ ఐపీఎల్ 2025..!
IPL 2025 Postponed ఐపీఎల్ రద్దు..
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఐపీఎల్ మ్యాచ్లను నిర్వహించే అవకాశం ఉంది. గురువారం (మే 8) ధర్మశాల స్టేడియంలో పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేయబడిన సంగతి తెలిసిందే. పంజాబ్, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లోని అనేక ప్రాంతాలు పాకిస్థాన్ నుంచి దాడికి గురవుతున్నందున రద్దు చేయబడింది.
భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 మొత్తం సీజన్ నిలిపివేయబడిందా లేదా తరువాత తేదీకి మార్చబడుతుందా అనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. భారత్, పాక్ దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మొత్తం లీగ్ రద్దు అయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు గురువారం రాత్రే తెలిపారు .