
pv sindhu olympics 2024
PV Sindhu : పారిస్ ఒలింపిక్స్ ఈవెంట్స్లో ఇండియన్స్ అదరగొడుతున్నారు.ఇప్పటికే ఇండియా రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకుంది. అయితే పీవీ సింధు గోల్డ్ మెడల్ దక్కించుకోవడం ఖాయం అని అందరు చెప్పుకొస్తున్నారు. సింధు ప్రత్యర్థులకు బలమైన సందేశం పంపుతూ తొలి మ్యాచ్ పూర్తి అధిపత్యంతో విజయాన్ని అందుకుంది. జూలై 28న జరిగిన మహిళల సింగిల్స్ గ్రూప్-ఎమ్లో సింధు తన తొలి మ్యాచ్లో మాల్దీవులకు చెందిన ఫాతిమా నబాహా అబ్దుల్ రజాక్ను సులభంగా ఓడించింది. ప్రపంచ నంబర్-111 ప్లేయర్తో జరిగిన ఈ మ్యాచ్లో సింధు 21-9, 21-6 తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో విజయం సాధించేందుకు సింధు కేవలం 29 నిమిషాలు పట్టింది. ఇప్పుడు సింధు జూలై 31న తన రెండో గ్రూప్ మ్యాచ్లో ఎస్టోనియాకు చెందిన క్రిస్టిన్ కుబాతో తలపడింది. ఈ మ్యాచ్లోను గెలిచి ప్రీక్వార్టర్ఫైనల్కు చేరుకుంది. 21-5,21-10 పాయింట్లతో పీవీ సింధు అదిరిపోయే విజయాన్ని అందుకుంది. కేవలం 34 నిమిషాలలో ఈ గేమ్ ముగిసింది. ముందు ఎస్టోనియా పోరాట పటిమ ప్రదర్శించిన సింధు మొక్కవోని దీక్షతో గేమ్ ఆడి సత్తా చాటింది.ఈ క్రమంలో గ్రూప్ ఎం నుండి సింధు ప్రీ క్వార్టర్స్లో రౌండ్ 16కి దూసుకెళ్లింది.
pv sindhu olympics 2024
సింధు హ్యాట్రిక్ ఒలింపిక్స్ మెడల్స్ సాధించడం ఖాయమని ఆమె తండ్రి పీవీ రమణ పేర్కొన్నారు. ఆయన తన కూతురు తప్పక ఫైనల్కు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్లో సింధు రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నాళ్లుగా సింధు తనపై ఉన్న అంచనాలను అందులేకపోయింది. కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత గత ఫామ్ను అందిపుచ్చుకోలేక పోయింది. ఒలింపిక్స్లో ఫామ్ కంటే ఆ రోజు మెరుగైన ప్రదర్శనే చాలా కీలకమని, దేశం గర్వించేలా తన కూతురు పోరాడుతుందని పీవీ రమణ ఆశాభావం వ్యక్తం చేశారు. పారిస్ విశ్వక్రీడల్లో సింధు పతకం సాధిస్తే.. ఒలింపిక్స్లో మూడు పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్రకెక్కుతోంది.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.