
#image_title
IND VS PAK : ఇది కదా అసలైన కిక్ అంటే. మన చిరకాల ప్రత్యర్థిని మన గడ్డ మీద ఓడిస్తే వచ్చే కిక్కే వేరప్పా. ఇవాళ జరిగింది అదే. భారత్ సత్తా ఇది అని పాకిస్థాన్ కు మరోసారి టీమిండియా నిరూపించింది. అవలీలగా పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. 30 ఓవర్లలోనే మ్యాచ్ ను టీమిండియా ముగించేసింది. సొంత గడ్డపై భారత్ సత్తా ఏంటో చూపించింది. దాయాదికి చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే రెచ్చిపోయాడు. సెంచరీకి చేరువ అయ్యాడు. 86 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించి పెవిలియన్ చేరాడు. 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఆరు సిక్సులు, 6 ఫోర్లు కొట్టి ఒక్కసారిగా స్కోర్ ను పెంచాడు రోహిత్ శర్మ. ఇక.. ఇవాళే మ్యాచ్ కి ఎంట్రీ ఇచ్చిన శుభ్ మన్ గిల్ అంతగా ఆకట్టుకోలేదు. 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 16 పరుగులే చేశాడు.
30.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి టీమిండియా విజయం సాధించింది. ఇంకా 117 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో భారీ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ తర్వాత శ్రెయాస్ అయ్యర్ రాణించాడు. హాఫ్ సెంచరీ చేసి భారత్ కు సులువుగా విజయాన్ని అందించాడు. 62 బంతుల్లో శ్రెయాస్ అయ్యర్ 53 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 19 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఆఫ్రిది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ ఇప్పుడు మూడు మ్యాచులు వరుసగా గెలిచింది. ఇక పాయింట్ల విషయంలో చూస్తే భారత్ అత్యధిక పాయింట్లతో ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ లో టాప్ లో నిలిచింది.
#image_title
పాక్ ను తన బౌలింగ్ తో కట్టడి చేసి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసిన బుమ్రాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించింది. ఇక.. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి టాప్ లో ఉన్న భారత్.. అక్టోబర్ 19న పసికూన బంగ్లాదేశ్ తో తలపడనుంది.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.