#image_title
IND VS PAK : ఇది కదా అసలైన కిక్ అంటే. మన చిరకాల ప్రత్యర్థిని మన గడ్డ మీద ఓడిస్తే వచ్చే కిక్కే వేరప్పా. ఇవాళ జరిగింది అదే. భారత్ సత్తా ఇది అని పాకిస్థాన్ కు మరోసారి టీమిండియా నిరూపించింది. అవలీలగా పాకిస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. 30 ఓవర్లలోనే మ్యాచ్ ను టీమిండియా ముగించేసింది. సొంత గడ్డపై భారత్ సత్తా ఏంటో చూపించింది. దాయాదికి చుక్కలు చూపించింది. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే రెచ్చిపోయాడు. సెంచరీకి చేరువ అయ్యాడు. 86 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోర్ అందించి పెవిలియన్ చేరాడు. 63 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఆరు సిక్సులు, 6 ఫోర్లు కొట్టి ఒక్కసారిగా స్కోర్ ను పెంచాడు రోహిత్ శర్మ. ఇక.. ఇవాళే మ్యాచ్ కి ఎంట్రీ ఇచ్చిన శుభ్ మన్ గిల్ అంతగా ఆకట్టుకోలేదు. 11 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా 16 పరుగులే చేశాడు.
30.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి టీమిండియా విజయం సాధించింది. ఇంకా 117 బంతులు మిగిలి ఉండగానే.. 7 వికెట్ల తేడాతో భారీ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ తర్వాత శ్రెయాస్ అయ్యర్ రాణించాడు. హాఫ్ సెంచరీ చేసి భారత్ కు సులువుగా విజయాన్ని అందించాడు. 62 బంతుల్లో శ్రెయాస్ అయ్యర్ 53 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 29 బంతుల్లో 19 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో ఆఫ్రిది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ గెలుపుతో భారత్ ఇప్పుడు మూడు మ్యాచులు వరుసగా గెలిచింది. ఇక పాయింట్ల విషయంలో చూస్తే భారత్ అత్యధిక పాయింట్లతో ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ కప్ లో టాప్ లో నిలిచింది.
#image_title
పాక్ ను తన బౌలింగ్ తో కట్టడి చేసి ఏడు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసిన బుమ్రాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రకటించింది. ఇక.. వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచి టాప్ లో ఉన్న భారత్.. అక్టోబర్ 19న పసికూన బంగ్లాదేశ్ తో తలపడనుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.