U19 World Cup 2026 Final : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో రికార్డుల వేట | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

U19 World Cup 2026 Final : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో రికార్డుల వేట

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 February 2026,4:30 pm

ప్రధానాంశాలు:

  •  U19 World Cup 2026 Final : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో రికార్డుల వేట

U19 World Cup 2026 Final : ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో U19 World Cup 2026 Final భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ Vaibhav Sooryavanshi చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టైటిల్ పోరులో కేవలం 14 ఏళ్ల వయసున్న ఈ బీహార్ కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.

U19 World Cup 2026 Final బిగ్ బ్రేకింగ్ న్యూస్‌ వైభవ్ సూర్యవంశీ వీరవిహారం అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో రికార్డుల వేట

U19 World Cup 2026 Final : బిగ్ బ్రేకింగ్ న్యూస్‌.. వైభవ్ సూర్యవంశీ వీరవిహారం.. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులతో రికార్డుల వేట

U19 World Cup 2026 Final : రికార్డుల వేటలో వైభవ్

U19 World Cup 2026 Final : వైభవ్ తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న వైభవ్, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఉన్ముక్త్ చంద్ (111) రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు (30) బాదిన ప్లేయర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే అండగా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే ఆరోన్ జార్జ్ వికెట్ కోల్పోయినప్పటికీ.. వైభవ్, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఆయుష్ (53 పరుగులు, 51 బంతులు) క్లాస్ ఆటతీరుతో ఆకట్టుకోగా, వైభవ్ మాస్ హిట్టింగ్‌తో స్టేడియంను హోరెత్తించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

భారత్ భారీ స్కోరు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో భారత్ కేవలం 25 ఓవర్లలోనే 250 పరుగుల మార్కును దాటింది. వైభవ్ అవుట్ అయిన తర్వాత కూడా విహాన్ మల్హోత్రా (30), వేదాంత్ త్రివేది (32) వేగంగా ఆడటంతో భారత్ 300 పైచిలుకు స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ మింటో, మ్యానీ లమ్స్‌డెన్ వికెట్లు తీసినప్పటికీ పరుగులను నియంత్రించలేకపోయారు.

14 ఏళ్ల వయసులోనే ఒక ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లో ఇన్ని రికార్డులు సృష్టించడం నిజంగా అద్భుతమని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ చూస్తుంటే టీమిండియాకు మరో సూపర్ స్టార్ దొరికాడనడంలో సందేహం లేదు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది