Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ

 Authored By ramu | The Telugu News | Updated on :12 May 2025,1:00 pm

Virat Kohli : కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బాట‌లోనే టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే త‌న నిర్ణ‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేశాడ‌ని, ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు త‌న‌ను ఎంపిక చేయొద్ద‌ని కోరిన‌ట్లు స‌మాచారం. అయితే.. రోహిత్ శ‌ర్మ దూర‌మైన నేప‌థ్యంలో కోహ్లీ కూడా ఆడ‌కపోతే ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త్ అనుభ‌వ‌లేమి జ‌ట్టును దెబ్బ‌తీస్తుంద‌ని భావించిన బీసీసీఐ అత‌డిని వారిస్తున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి.

Virat Kohli : ఎందుకింత స‌డెన్గా..

అయితే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్‌ను ప్రకటించారు. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముందు ఈ నిర్ణయాన్ని విరాట్ ప్రకటించాడు. కోహ్లీ ఇటీవల టెస్టు క్రికెట్‌లో తన స్వరూపం కోల్పోతున్నట్లు కనిపించారు. కొన్ని సంవత్సరాల్లో కోహ్లీ ఈ ఫార్మాట్‌లో రాణించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Virat Kohli బిగ్ బ్రేకింగ్ టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ

Virat Kohli : బిగ్ బ్రేకింగ్.. టెస్ట్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ

సోమవారం సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు కింగ్ కోహ్లీ ప్రకటించాడు. రోహిత్ శర్మ టెస్టుల నుంచి తప్పుకున్న వారం రోజుల లోపే కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలకడం టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కొన్ని రోజుల ముందు భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్టు క్రికెట్ నుండి తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. రోహిత్‌, విరాట్ ఇద్దరు కూడా గత సంవత్సరంలో బార్బడోస్‌లో జరిగిన ప్రపంచ కప్ విజయంతో T20I క్రికెట్ నుండి దూరమయ్యారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది