Virat Kohli : విరాట్ కోహ్లికి వేసిన నోబాల్‌పై న‌డుస్తున్న, చ‌ర్చ‌.. అది క‌రెక్టా, రాంగా.. వీడియో ..!

Advertisement
Advertisement

Virat Kohli : భార‌త్ -పాక్ మ్యాచ్ ఎంత ఉత్కంఠగా మారిందో మ‌నంద‌రం చూశాం. 6 ప‌రుగుల‌కి 16 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో మ్యాచ్ అంతా ఉత్కంఠ‌గా సాగింది. అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. చివ‌రి ఓవ‌ర్ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ స్పిన్నర్ నవాజ్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికే హార్దిక్ ఔట్ కాగా.. రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీసి ఇచ్చాడు. మూడో బంతికి రెండు పరుగులు తీసిన విరాట్ కోహ్లి.. నాలుగో బంతిని సిక్స్‌గా మలిచాడు. కానీ బంతి నడుం కంటే ఎక్కువ ఎత్తులో రావడంతో నో బాల్ ఇవ్వాలని విరాట్ కోరాడు. దీంతో అంపైర్ నోబాల్ ఇచ్చాడు.తర్వాతి బంతిని ఫ్రీ హిట్ కాగా.. నవాజ్ వైడ్ వేశాడు. మరుసటి బంతికి కోహ్లి బౌల్డ్ అయినప్పటికీ.. అది ఫ్రీ హిట్ కావడంతో మూడు ప‌రుగులు తీసారు.

Advertisement

ఇక చివ‌రి బంతిని న‌వాబ్ వైడ్ వేయ‌గా, 1 బంతిలో 1 ప‌రుగుగా మారింది. చివ‌రి బంతికి మిడ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపిన అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు అంద‌రు నో బాల్ గురించే చ‌ర్చిస్తున్నారు. విరాట్ క్రీజ్ వదిలి బయటకు వచ్చాడు కాబట్టి అది నో బాల్ కాదని వాదిస్తున్నారు. నో బాల్‌ను ఎందుకు సమీక్షించలేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అంపైర్లను ప్రశ్నించాడు. ఫ్రీ హిట్‌ బంతికి కోహ్లి బౌల్డయ్యాక.. అది డెడ్ బాల్‌ ఎందుకు కాలేదని ప్రశ్నిస్తూ హాగ్ ట్వీట్ చేశాడు. అంపైర్లు భారత్‌కు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ నాసీర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. ఈ వివాదంపై ‘ది బ్రిడ్జ్’ అనే వెబ్‌సైట్ ఐసీసీ నిబంధనలతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

Advertisement

Virat Kohli no ball controversy on India vs Pakistan T20 World Cup match

Virat Kohli : ఒక‌టే చ‌ర్చ‌..

‘ఐసీసీ 20.1.1 నిబంధన ప్రకారం.. బంతి వికెట్ కీపర్ లేదా బౌలర్ చేతుల్లో పడితే (20.1.1.1), బౌండరీ బాదితే (201.1.2) అది డెడ్ బాల్ అవుతుంది. 20.1.1.3 నిబంధన ప్రకారం బ్యాటర్ అవుటైతే బంతిని వెంటనే డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. కానీ అది ఫ్రీ హిట్ కావడంతో.. నవాజ్ కోహ్లిని బౌల్డ్ చేసినప్పటికీ అది ఔట్ కాదు.. అలాగే బంతి డెడ్ కాదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్ కెమెరాను తాకడంతో అంపైర్లు డెడె బాల్‌గా ప్రకటించారు’ అని ఆ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 53 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ స్కోరులో 6 ఫోర్లు, 4 సిక్సులున్నాయి.

Advertisement

Recent Posts

T20 World Cup 2026: కివీస్ కోట బద్దలు.. న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ICC T20 World Cup 2026లో సౌతాఫ్రికా తన…

5 hours ago

Telangana : తెలంగాణా హంగ్ మున్సిపాలిటీల్లో అధికారం ఎవరిది..?

Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…

7 hours ago

Rashmi Gautam : బంగారం లాంటి వాడు దొరికాడు .. యాంకర్ రష్మీ పెళ్లి కి అంతా రెడీ !

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…

8 hours ago

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

9 hours ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

11 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

11 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

15 hours ago