
Virat Kohli on india won the match
Virat Kohli : పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే ఏ రేంజ్లో కిక్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకన్నా ఎక్కువ కిక్ ఈ రోజు మ్యాచ్ తో వచ్చింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా ఈ మ్యాచ్ సాగగా, విజయం భారత్నే వరించింది. కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ వరల్డ్ కప్ లో తొలి విజయం నమోదు చేసుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు.
ఇక మ్యాచ్ గెలవడం కష్టమే అనుకున్న సమయంలో విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (40) అండగా నిలబడటంతో రెచ్చిపోయిన కోహ్లీ.. అవసరమైన రన్రేట్ పెరిగిపోయిందని అనిపించిన ప్రతిసారీ బౌండరీలు బాదుతూ వచ్చాడు. చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా కోహ్లీ, అశ్విన్ అద్భుతంగా ఓడి భారత్ కి విజయాన్ని అందించారు. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. నసీమ్ షా ఒక వికెట్ తీసుకున్నాడు. అక్టోబర్ 23 తేదిన విరాట్ రెండు భారీ ఇన్నింగ్స్ ఆడటం గమనార్హం.
Virat Kohli on india won the match
2011 అక్టోబర్ 23న ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2015 అక్టోబర్ 22న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 138 పరుగులతో రాణించాడు. 2016 అక్టోబర్ 23న న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 154 పరుగులతో అజేయంగా నిలిచాడు. 2017 అక్టోబర్ 21న వెస్టిండీస్తో 140 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ మరుసటి రోజే న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 121 పరుగులు చేశాడు. 2018 అక్టోబర్ 24న వెస్టిండీస్పై 157 పరుగులతో అజేయంగా నిలిచాడు.గతేడాది టీ20 ప్రపంచకప్లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత బ్యాటర్లంతా విఫలమైన వేళ విరాట్ కోహ్లీ ఒక్కడే 57 పరుగులతో రాణించి ఇజ్జత్ కాపాడాడు. మొత్తానికి ఆ సెంటిమెంట్ కొనసాగించాడు.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.