
Virat Kohli story viral on Social media
Virat Kohli : భారత్ పాక్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం క్రికెట్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది.పాకిస్థాన్తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్) అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.
షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40) రాణించాడు.ఈ విజయం మాత్రం అందరికి మాంచి కిక్ ఇచ్చింది. అయితే విజయం తర్వాత పిడికిలితో నేలను బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇది రెండోసారి.
Virat Kohli story viral on Social media
2016 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఇలానే ఎమోషనల్ అవుతాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టును సెమీస్ కు చేర్చిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. అయితే మ్యాచ్ విన్నింగ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. “2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో నేను చివరిసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఇప్పటివరకు అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్. ఈరోజు నేను దీన్ని అంతకంటే ఎక్కువగా లెక్కిస్తాను. నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఇవి మరపురాని రాత్రులు..” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో కడదాకా క్రీజులో ఉన్న కోహ్లీ తన వీరోచిత ఇన్నింగ్స్ తో దాయాది పాకిస్తాన్ పై మరుపురాని విజయాన్ని అందిచాడు. ఈ క్రమంలో నేలను పిడికిలితో బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లో గురువారం నెదర్లాండ్స్తో తలపడనుంది.
Ys Jagan : ఇటీవల అసెంబ్లీ ఆవరణలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మనసులో…
Hey Balwanth Movie Review : టాలీవుడ్లో Tollywood ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ స్థాయి నుంచి వచ్చి,…
Sreemaalika Book : హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ…
Brother Wife : సాధారణంగా అన్న భార్యను తల్లిలా భావించి గౌరవించడం మన సంస్కృతి. అయితే పల్నాడు జిల్లా రొంపిచర్ల…
Vidadala Rajini : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాజీ మంత్రి విడదల రజిని పేరు మారుమోగిపోతోంది. ముఖ్యంగా…
Vundavalli Arun Kumar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో మేధావిగా పేరున్న ఉండవల్లి అరుణ్ కుమార్ తీరుపై ఇప్పుడు…
Anchor Eshwar Sakshi ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ 'సాక్షి'లో సుదీర్ఘ కాలంగా సీనియర్ యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో ఈశ్వర్…
Jobs : రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న…
Vivo V70 Series 5G : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త V70 సిరీస్ 5Gను ఈరోజు…
Good News to Telangana Farmers : తెలంగాణలోని అన్నదాతలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. సన్న…
India Vs Pakistan : టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ మ్యాచ్లు ముగియడంతో సూపర్…
Good News to Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా చేసుకుని వరుస కీలక నిర్ణయాలను అమలు…
This website uses cookies.