
Virat Kohli story viral on Social media
Virat Kohli : భారత్ పాక్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరచడంతో ఈ మ్యాచ్ లో భారత్ విజయం క్రికెట్ అభిమానులకి మంచి కిక్ ఇచ్చింది.పాకిస్థాన్తో జరిగిన హైఓల్టేజ్ మ్యాచ్లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 నాటౌట్) అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ కోహ్లీ తనదైన బ్యాటింగ్తో ఆదుకున్నాడు. విరాట్ సూపర్ బ్యాటింగ్తో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.
షాన్ మసూద్(42 బంతుల్లో 5 ఫోర్లతో 52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్(34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో పాక్ను ఆదుకున్నారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా మూడేసి వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా..నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీకి అండగా హార్దిక్ పాండ్యా(37 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 40) రాణించాడు.ఈ విజయం మాత్రం అందరికి మాంచి కిక్ ఇచ్చింది. అయితే విజయం తర్వాత పిడికిలితో నేలను బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీ ఇలా ఎమోషనల్ అవ్వడం ఇది రెండోసారి.
Virat Kohli story viral on Social media
2016 వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో ఇలానే ఎమోషనల్ అవుతాడు. తన వీరోచిత ఇన్నింగ్స్ తో జట్టును సెమీస్ కు చేర్చిన ఆ ఇన్నింగ్స్ ఎప్పటికీ మరుపురానిదే. అయితే మ్యాచ్ విన్నింగ్ తర్వాత కోహ్లీ మాట్లాడుతూ.. “2016లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో నేను చివరిసారిగా భావోద్వేగానికి లోనయ్యాను. ఇప్పటివరకు అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్. ఈరోజు నేను దీన్ని అంతకంటే ఎక్కువగా లెక్కిస్తాను. నా 15 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఇవి మరపురాని రాత్రులు..” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచులో కడదాకా క్రీజులో ఉన్న కోహ్లీ తన వీరోచిత ఇన్నింగ్స్ తో దాయాది పాకిస్తాన్ పై మరుపురాని విజయాన్ని అందిచాడు. ఈ క్రమంలో నేలను పిడికిలితో బలంగా గుద్ది ఎమోషనల్ అయ్యాడు. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్లో గురువారం నెదర్లాండ్స్తో తలపడనుంది.
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
New Houses : ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…
This website uses cookies.