
What happened in Pakistan dressing room after losing the match India
India vs Pakistan : ఇండియా- పాకిస్తాన్ మధ్య ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకి ఎంత మజా అందించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు. ముఖ్యంగా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆట తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా టైట్గా సాగిన ఈ మ్యాచ్లో కోహ్లీ చాలా అద్భుతమైన ప్రదర్శన కనిపించాడు. చివరి ఓవర్లో 16 పరుగులు కావాల్సి ఉండగా బంతి బంతికి ఉత్కంఠ మధ్య సాగిన ఓవర్లో భారత్ నే విజయం వరించింది. 160 పరుగుల టార్గెట్ను ఛేదించే క్రమంలో రోహిత్, రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ అవుటైనా.. హార్దిక్ పాండ్యాతో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు కోహ్లీ.
చిరకాల ప్రత్యర్థిపై భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. గెలవాల్సిన మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు ఓడిపోవడంతో కుంగిపోయారు. మ్యాచ్ తర్వాత వారి డ్రెస్సింగ్ రూమ్ నిశ్శబ్దంగా మారిపోయింది. ఆటగాళ్లంతా తలపట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సమయంలో పాక్ బ్యాటింగ్ కోచ్ మ్యాథ్యూ హేడెన్ పాక్ ఆటగాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశాడు. అలాగే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. వారిని సాదారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్ని చేశాడు. . మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ.. అతను కూడా కొంత భావోద్వేగానికి గురయ్యాడు. చూడండి.. మ్యాచ్లో మనం మంచి ప్రదర్శన చేశాం. కొన్ని తప్పులు కూడా చేశాం. అవి సరి చేసుకొని ముందుకు వెళదాం. ఇది మనకు ఫస్ట్ మ్యాచ్ .ఇంకా ఎన్నొ మ్యాచ్లు మనం ఆడాల్సి ఉంది.
What happened in Pakistan dressing room after losing the match India
ఒక్కరి వలన మనం ఓడిపోలేదు. మనం జట్టుగానే ఓడాం.. జట్టుగానే గెలుస్తాం. మనం టీమ్గా చాలా బాగా ఆడాం. దాన్నే కొనసాగిద్దాం. మ్యాచ్ ఓడిపోయినా.. కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు చూశాం. వాటిని నుంచి స్ఫూర్తి పొందండి.’ అని బాబర్ అన్నాడు. చివరి ఓవర్ వేసిన నవాజ్ని ఓదారుస్తూ ‘నవాజ్ నువ్వేమి దిగులు చెందకు.. నువ్వు నా మ్యాచ్ విన్నర్.. నీ పట్ల నాకెప్పుడు నమ్మకం ఉంటుంది.’ అని చెప్పాడు. ఇక మెల్బోర్న్ లో జరిగిన ఈ మ్యాచ్ నరాలు తెగేంతగా ఉత్కంఠగా కొనసాగింది. ఈ పోరులో 160 పరుగుల టార్గెట్ ను 20 ఓవర్లలో అందుకుంది భారత్. నాలుగు వికెట్ల తేడాతో గెలిచి టీ20 ప్రపంచకప్ లో బోణీ కొట్టింది. విరాట్ కోహ్లీ మ్యాచ్ని మలుపు తిప్పడమే కాకుండా 53 బంతుల్లో 82 పరుగులు చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టి నాటౌట్గా నిలిచారు.
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
This website uses cookies.