
Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. అమెజాన్ వేదికగా ప్రస్తుతం 32 అంగుళాల స్మార్ట్ టీవీ కేవలం రూ.7,499కే అందుబాటులో ఉంది. తక్కువ ధరతో పాటు మంచి ఫీచర్లు, రేటింగ్స్ ఉండటంతో ఇప్పటికే వేల మంది ఈ టీవీని కొనుగోలు చేశారు. సాధారణంగా టీవీ కొనే సమయంలో చాలా మంది బ్రాండెడ్ కంపెనీల వైపే మొగ్గు చూపుతారు. అయితే వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో పాటు, టెక్నాలజీ వేగంగా మారిపోతుండటంతో కొద్ది సంవత్సరాల్లోనే అవి పాతబడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణులు కూడా ఎక్కువ ఖర్చు పెట్టకుండా, మంచి రేటింగ్ ఉన్న బడ్జెట్ టీవీలను ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్
ఈ టీవీ VW కంపెనీకి చెందిన 80 సెంటీమీటర్లు (32 అంగుళాలు) సైజ్లో వస్తుంది. పెద్ద బ్రాండ్ కాకపోయినా, నెటిజన్లలో ఈ కంపెనీ టీవీలకు మంచి ఆదరణ లభిస్తోంది. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ అందించడంతో రివ్యూలు, రేటింగ్స్ బాగున్నాయి.
ఈ స్మార్ట్ టీవీకి 24 వాట్స్ సౌండ్ ఔట్పుట్ ఉంది. బాక్స్ స్పీకర్లతో స్టీరియో సౌండ్ వస్తుంది. అలాగే ఐదు రకాల సౌండ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే విషయానికి వస్తే QLED, IPE టెక్నాలజీతో వస్తూ 1.67 కోట్ల కలర్స్ను సపోర్ట్ చేస్తుంది.
ఈ టీవీకి HD రెడీ రిజల్యూషన్ (1366 x 768 పిక్సెల్స్) ఉంది. 60Hz రిఫ్రెష్ రేటుతో కళ్లకు హాని లేకుండా వీక్షించవచ్చు. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉండటంతో ఇంట్లో ఎక్కడ కూర్చున్నా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.
Smart TV స్మార్ట్ ఫీచర్లు కూడా ఫుల్
Prime Video, Netflix, Jio Hotstar, Zee5 వంటి ప్రముఖ ఓటీటీ యాప్స్ ఇన్బిల్ట్గా ఉన్నాయి. స్క్రీన్ మిర్రరింగ్ సపోర్ట్ ఉండటంతో మొబైల్లోని కంటెంట్ను నేరుగా టీవీలో ప్లే చేయవచ్చు. PCకి కనెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. క్వాడ్ కోర్ ప్రాసెసర్తో టీవీ స్మూత్గా పనిచేస్తుంది.
HDMI, USB పోర్టులు, వైఫై, LAN కనెక్షన్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. ఎనర్జీ రేటింగ్ 4 ఉండటంతో విద్యుత్ వినియోగం కూడా తక్కువే. ఏడాదికి సుమారు 46 యూనిట్ల కరెంట్ మాత్రమే ఖర్చవుతుంది.
భారీ డిస్కౌంట్ – EMI ఆప్షన్
ఈ టీవీ అసలు ధర రూ.18,999 కాగా, ప్రస్తుతం 61 శాతం డిస్కౌంట్తో రూ.7,499కే అందుబాటులో ఉంది. EMIలో కొనాలంటే నెలకు కేవలం రూ.264 చెల్లిస్తే సరిపోతుంది. పాత టీవీని ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.2,000 వరకు అదనపు లాభం కూడా పొందవచ్చు.
ఇప్పటికే 17,000 మందికి పైగా ఈ టీవీని కొనుగోలు చేయగా, 4/5 రేటింగ్ను సొంతం చేసుకుంది. ఒక సంవత్సరం వారంటీ, 10 రోజుల రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉండటంతో కస్టమర్లు నమ్మకంగా కొనుగోలు చేస్తున్నారు.
కస్టమర్ అభిప్రాయాలు
చాలా మంది వినియోగదారులు ధరకు తగిన విలువ ఉందని, పిక్చర్ క్వాలిటీ, సౌండ్ పనితీరు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు యాప్స్ పనితీరుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా బడ్జెట్లో మంచి స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది ఓ మంచి ఆప్షన్గా మారింది.
Venu Swamy : సెలబ్రిటీ జ్యోతిష్యుడిగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ…
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
This website uses cookies.