
Central government has given good news to UPI users
UPI : కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ పేస్ సేవలపై ఎటువంటి చార్జీలు తీసుకోవట్లేదని వెల్లడించింది. డిజిటల్ బ్యాంక్ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం చార్జీలు విధించునున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి దీనిపై ఒక క్లారిటీ చేసింది. యూపీఏ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ సేవలపై ఎలాంటి చార్జీలు విధించడం లేదని ఆర్థిక శాఖ తెలిపింది. కాస్ట్ రికవరీ కోసం రివైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ప్రతి యూపీఐ చెల్లింపులకు అదనపు చార్జీలు విధించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన చేసింది. యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గుడ్. యూపీఐ సేవలకు చార్జీలు విధించేందుకు ప్రభుత్వం ఎలాంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలని ప్రభుత్వం గత సంవత్సరం డిజిటల్ పేమెంట్ పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది.
Central government has given good news to UPI users
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపులను ప్లాట్ఫారంలను ఆర్థికంగా వినియోగదారుల స్నేహపూర్వకంగా ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా అదే విధంగా ప్రకటించింది. ప్రస్తుతం అధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ డిజిటల్ పేమెంట్స్ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం యుపిఐ సేవలపై ఎటువంటి చార్జీలు విధించడం లేదని వెల్లడించింది దీంతో యూపీఐ వినియోగదారులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
CBN warning to YS Jagan : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
This website uses cookies.