AI ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? దొంగను పట్టుకుంటున్న AI..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Updated on : 6 March 2026, 8:00 pm
  •  AI ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? దొంగను పట్టుకుంటున్న AI..!

  •  వంటింట్లో పనిమనిషి దొంగతనం, AI తో పట్టుకున్న ఇంటి యజమాని

  •  AI ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? దొంగను పట్టుకుంటున్న AI..!

AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న టెక్నాలజీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టెక్ నిపుణుడి ఇంట్లో పండ్లు, ఆహార పదార్థాలు మాయమవ్వడం పంకజ్ తన్వార్‌ను ఆలోచనలో పడేసింది. సాధారణంగా ఎవరైనా ఇలాంటి సమయంలో సీసీటీవీ కెమెరాలను ఆశ్రయిస్తారు, కానీ పంకజ్ ఒక అడుగు ముందుకు వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత నిఘా వ్యవస్థను తన వంటింట్లో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ కేవలం దృశ్యాలను రికార్డ్ చేయడమే కాకుండా, పనిమనిషి యొక్క ప్రతి కదలికను విశ్లేషించి రిపోర్టులను సిద్ధం చేసింది. ఆమె ఎప్పుడు చేతులు కడుక్కుంది, ఎప్పుడు ఫ్రిజ్ తెరిచింది, ఏ వస్తువును తన జేబులో వేసుకుంది వంటి వివరాలను క్షుణ్ణంగా పంకజ్ మొబైల్‌కు చేరవేసింది. కేవలం పండ్లు దొంగిలించడమే కాకుండా, పరిశుభ్రత పాటించకపోవడాన్ని కూడా ఈ ‘డిజిటల్ డిటెక్టివ్’ పసిగట్టి సాక్ష్యాలతో సహా యజమానికి అప్పగించింది.

AI ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? దొంగను పట్టుకుంటున్న AI..!

AI ఇలాంటి పనులు కూడా చేస్తుందా..? దొంగను పట్టుకుంటున్న AI..!

AI వంటింట్లో పనిమనిషి దొంగతనం, AI తో పట్టుకున్న ఇంటి యజమాని

అయితే, ఈ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు రెండు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంతమంది పంకజ్ చర్యను సమర్థిస్తూ, నమ్మకమే పునాదిగా ఉండే ఇంట్లో దొంగతనం ఏ రూపంలో ఉన్నా తప్పేనని వాదిస్తోంది. చిన్న చిన్న దొంగతనాలే రేపు పెద్ద నేరాలకు దారితీస్తాయని, టెక్నాలజీని వాడుకుని తప్పును నిరూపించడంలో తప్పులేదని వారు భావిస్తున్నారు. యజమాని తన ఆస్తిని, ఆరోగ్యాన్ని కాపాడుకునే హక్కు కలిగి ఉంటాడని, దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పనిలోంచి తొలగించడం సరైన నిర్ణయమని వీరి అభిప్రాయం.

AI ఇక దొంగలను పట్టుకోవాలంటే పోలీసులు అవసరం లేదు.. ఎందుకంటే AI నే ఆ పని చేస్తుంది !!

మరోవైపు, ఈ వ్యవహారం నైతికత మరియు వ్యక్తిగత గోప్యత (Privacy)పై పెద్ద చర్చకు దారితీసింది. నెలకు కేవలం రూ. 4,800 జీతం తీసుకునే ఒక సామాన్య మహిళపై, వేల రూపాయల విలువైన ఏఐ టెక్నాలజీని వాడి నిఘా పెట్టడం అవసరమా? అని మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు. ఒక ఆపిల్ లేదా అరటిపండు దొంగిలించడం వెనుక ఆకలి ఉండి ఉండవచ్చని, అంత మాత్రానికే ఆమెను సమాజం ముందు దోషిగా నిలబెట్టడం ఆమె గౌరవానికి భంగం కలిగించడమేనని వారు వాదిస్తున్నారు.

Advertisement

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి