Electric Cars : ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ రకాల కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు చాలా మంది కూడా ఈవీ కార్లపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే బ్రిటిష్కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లోకి మరో ఈవీ కార్ను లాంచ్ చేసింది. ఈ ఈవీ కార్ రూ.9.99లక్షల ప్రారంభ ధరతో కంపెనీ విడుదల చేసింది. ఇది ఎక్స్షోరం ధరమాత్రమే. జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ తర్వాత మూడో ఎలక్ట్రిక్ కారు విండోసోర్ కావడం విశేషం. కొత్తగా బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ప్రోగ్రామ్ని సైతం ఎంజీ ప్రారంభించగా, ఇందులో కిలోమీటర్కు రూ.3.5 చొప్పున చెల్లించి బ్యాటరీని తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇక కారు అడ్వాన్స్డ్ బుకింగ్ అక్టోబర్ 3న మొదలై.. 12 నుంచి డెలివరీ చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఎంజీ దీనిని సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్) గా పిలుస్తుంది. ఈ కొత్త ఈవీ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీల మధ్య ధరతో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కారు విడుదలతో మార్కెట్లో తన గ్రిప్ని మరింత పెంచుకోవాలని ఎంజీ మోటార్స్ ఇండియా ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది.ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈవీ కార్లతో పోలిస్తే విండ్సోర్ డిజైన్ భిన్నంగా ఉంటుంది. లుక్స్లో ఉలుంగ్ క్లౌడ్ ఈవీ తరహాలో రూపొందించగా.. భారత్లో అవసరమైన పలు మార్పులు చేసి ప్రత్యేకంగా గుర్తింపును తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ కారు చైనా వులింగ్ క్లౌడ్ ఈవీ రీ బ్రాండెడ్ వెర్షన్. ఇది ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్నది. ఇక ఎండీ విండ్సోర్ ఈవీ 134 బీహెచ్పీ, 200 ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది.
ఎంజీలో జేఎస్డబ్ల్యూ సంస్థ వాటాలు కొనుగోలు చేసిన అనంతరం విడుదల చేసిన తొలి ఈవీ ఇదే. జెడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీలకు భిన్నంగా మిడ్సైజ్ క్రాసోవర్ డిజైన్లో కంపెనీ రూపొందించింది. అత్యాధునిక ఫీచర్స్తో పాటు ప్రయాణికులకు విశాలమైన స్పేస్ని ఆఫర్ చేసినట్లు కంపెనీ చెప్పింది. . బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్తో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కావున బ్యాటరీ కోసం కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఈ కారుని బై బ్యాక్ పాలసీలో 3 సంవత్సరాల తర్వాత కూడా 60 శాతం సొమ్ముని తిరిగి పొందవచ్చు. ఈ విండ్సర్ ఈవీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కాగా.. టెస్ట్ డ్రైవ్స్ 25 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 నుంచి ఈ కార్లను కస్టమర్లకు డెలివరీలు చేయనున్నారు.
Job Mela : యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో…
Jaggery : బెల్లం అనేది రుచికి మాత్రమే కాదు చర్మ సమస్యలను కూడా దూరం చేస్తుంది అని మీకు తెలుసా.…
Namo Bharath Rapid Rail : దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల గురించి విసృత ప్రచారం…
Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధిపు కేసు విషయంలో రోజు రోజుకి నిర్గాంతపోయే నిజాలు…
Janhvi kapoor : ఎన్టీఆర్ దేవర సినిమా మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను కొరటాల…
Chandra Dosham : హిందూ మతంలో ఏడు రోజులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది. అయితే సోమవారం…
Chandrababu : రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాం ఇస్తుండగా,…
Hyper Aadi : జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్, లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే.. కేవలం…
This website uses cookies.