UPI Transaction : ప్రస్తుతం దేశం మొత్తం తమ పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్ ద్వారానే అంటే యు.పి.ఐ వారా చేస్తున్నారు. నగదు రహిత చెల్లింపులను ఎంకరేజ్ చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పేమెంట్స్ జరగాలని ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. ఎవరైనా ఎక్కడైనా వారి ఆర్ధిక లావాదేవీలను యు.పి.ఐ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీలు భారీగా పెరిగే పండగ లాంటి సమయాల్లో వీటి వాడకం మరింత ఎక్కువ ఉంటుంది. డిజిటల్ లావాదేవీలు అంటే స్కానర్, క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ నెంబర్ కి డైరెక్ట్ గా చెల్లించడం లాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం యు.పి.ఐ పేమెంట్స్ ను 5 లక్షల ఆకా పెంచడం జరిగింది. ఇది వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గతంలో యు.పి.ఐ ట్రాన్ సాక్షన్ గరిష్ట మొత్తం కేవలం 1 లక్ష మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ లావాదేవీలను 5 లక్షల దాకా పొడిగించారు. ఈ పెరిగిన పరిమితి నిర్ధిష్ట ఫీల్డ్ లో వారికి మాత్రమే అని తెలుస్తుంది.
5 లక్షల యుపిఐ చెల్లింపు పరిమితి కింది వర్గాలకు మాత్రమే ఇస్తారు. అందులో పన్ను చెల్లింపులు, విద్యా సంస్థల పేమెంట్స్, ఐ.పి.ఓ, హాస్పిటల్ బిల్లులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైరెక్ట్ రిటైల్ ట్రాన్సాక్షన్ సిస్టం ఇలాంటి కేటగిరిల్లో యు.పి.ఐ సిస్టం అధిక విలువ లావాదేవీలు చేసే అవకాశం ఇస్తున్నారు.
ఈ మార్పుల ద్వారా ఎంతోమంది వినియోగదారులకు యు.పి.ఐ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయి. ఇండియాను నగదు రహిత ఆర్ధిక వ్యవస్థగ మార్చాలనే మోడీ ప్రభుత్వ లక్ష్యానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పొచ్చు. ఐతే పెద్ద మొత్తం లో డిజిటల్ పేమెంట్స్ కాబట్టి అవతల వ్యక్తి యొక్క నెంబర్ కానీ డీటైల్స్ కానీ అన్నీ కరెక్ట్ గా ఉండేట్లు చూసుకోవాలి లేదంటే పొరపాటు జరిగే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా సరే చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
Ys Jagan : ప్రస్తుతం జగన్ వ్యవహారం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయనపై షర్మిళ కొన్నాళ్లుగా సంచలన ఆరోపణలు చేస్తూ…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య చిరకాల వాగ్వాదం…
YS Jagan : ఆస్తుల విషయంలో వైఎస్ జగన్ అతని చెల్లి షర్మిల Ys Sharmila మధ్య గొడవలు జరుగుతున్నాయన్న…
Ponguleti Srinivas Reddy : ఒకటి రెండు రోజుల్లో తెలంగాణలో రాజకీయపరంగా బాంబులు పేలుతాయని అవి పెను విస్పోవడానికి దారి…
Ind Vs Nz 2nd Test : తొలి టెస్ట్లో దారుణంగా ఓడిన టీమిండియా రెండో టెస్ట్లో పట్టు బిగించింది…
Pushpa 2 The Rule : అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా…
Viral News : కొన్ని విషాదాలు తీరని దుఃఖాన్ని మిగులుస్తాయి. హృదయాన్ని మెలిపెట్టే విషాదాలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతుండడం…
Ys Jagan : గత కొద్ది రోజులుగా జగన్, వైఎస్ షర్మిళ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. షర్మిళ వలన…
This website uses cookies.