Smart Phone : ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ అనర్ధాలు ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వచ్చాక, ఇంటర్నెట్ చౌకగా లభిస్తుండడంతో దాని వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. దాదాపుగా 5,6 గంటలు స్మార్ట్ ఫోన్ లోనే మునిగితేలుతున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడడం వలన కళ్ళపై , గుండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేనినైనా పరిమితంగా వాడితే ఏమి కాదు కానీ అతిగా వాడటం వలన అది అనర్థమే అని అంటున్నారు. పిల్లల మనసు అద్దం లాంటిది. ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు ఏం చేస్తున్నారో పిల్లలు కూడా అదే చేస్తుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్, లాప్టాప్ వంటివి చూడటం తగ్గించి పిల్లలతో మాట్లాడడం, చిన్నచిన్న ఆటలు ఆడిపించడం వంటివి చేయాలి.
ప్రస్తుతం పిల్లలు ఫోన్ ఇస్తేనే అన్నం తింటాం అంటున్నారు. చిన్నప్పటినుంచి తల్లిదండ్రులు పిల్లల కోసం ఫోన్ లను చూడడం అలవాటు చేస్తున్నారు. అందులో వీడియోలు చూడడం అలవాటు చేస్తున్నారు. దీంతో ఫోన్ చూస్తే కానీ భోజనం చేయని పరిస్థితి ఏర్పడింది. గేమ్స్, వీడియోలు అంటూ గంటలు కొద్ది పిల్లలు ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారు. కొందరు పిల్లలు ఫోన్ ఉంటే తప్ప అన్నం తినరు. అలాంటప్పుడు ముందు ఒక ఐదు నిమిషాలు ఫోన్ లేకుండా అన్నం తినిపించాలి. పేచి పెట్టకుండా తింటే ఆ సమయాన్ని పెంచుకుంటూ ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్లకు అన్నం తినిపించడం అలవాటు చేయాలి. పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి. కూర ఎలా ఉంది అని అడగాలి.
కబుర్లు, చిన్న చిన్న కథలు చెబుతూ వారితో సరదాగా ఉంటే ఫోన్ చూపించి అన్నం తినిపించాల్సిన అవసరం ఉండదు. బాల్యం నుంచి పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రోత్సహించాలి. బొమ్మల పుస్తకాలు ఇవ్వడం, కథల పుస్తకాల్లోని కథలను వారికి చెప్పడం, చిన్న పజిల్స్ పరిష్కరించేలా చూడాలి. అప్పుడు వారు స్మార్ట్ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. పిల్లలను ఎప్పుడు ఇంట్లోనే ఉంచకూడదు. చుట్టుపక్కల, పక్కింటి పిల్లలతో ఆడుకునే చూసుకోవాలి. అవకాశం ఉంటే కాసేపు వారితో ఆడుకోవాలి. కాసేపు అవుట్డోర్ గేమ్స్, క్యారమ్స్ చెక్ వంటివి ఆడుతూ ఉంటే పిల్లలు స్మార్ట్ ఫోన్ జోలికి వెళ్లకుండా ఉంటారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా చూడకుండా ఉంటారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.