
UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
UPI : డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. డీమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లేని లావాదేవీలు విస్తృతంగా జరిగిపోతున్నాయి. చిన్న కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, ఆటో డ్రైవర్లు, ఇంకా బిచ్చగాళ్లు కూడా యూపీఐ క్యూఆర్ కోడ్ స్కానర్లతో డిజిటల్ చెల్లింపుల బాట పడుతున్నారు. స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు.. జేబులో రూపాయి లేకున్నా దేశం మొత్తం తిరగొచ్చే స్థితి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ పేమెంట్స్పై కేంద్ర ప్రభుత్వం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
UPI పేమెంట్స్ చేసేవారికి షాక్ ఇవ్వబోతున్న కేంద్రం..!
తాజా సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం రూ.2వేలు పైబడి చేసే యూపీఐ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెంచే దిశగా ఇది ఒక కొత్త మార్గమని భావిస్తోందట. ఇటువంటి చర్య అమలులోకి వస్తే, దీని ప్రభావం సామాన్య వినియోగదారుల నుంచి చిరు వ్యాపారులు, మధ్య తరగతి ప్రజల వరకు ఎక్కువగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటిదాకా ఉచితంగా చేసుకొచ్చిన డిజిటల్ చెల్లింపులపై జీఎస్టీ విధిస్తే వినియోగదారులకు అదనపు భారం మోపినట్టే అవుతుంది.
డిజిటల్ వ్యవస్థపై ప్రభావం పడేలా ఉందా?
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే, డిజిటల్ చెల్లింపుల ఉత్సాహాన్ని తగ్గించే ప్రమాదం ఉంది అని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు మళ్లీ నగదు లావాదేవీల వైపు మళ్లే అవకాశం ఉందని, ఇది ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యానికి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడుతున్నారు. వినియోగదారుల భారం పెరగకూడదని, డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం కొనసాగించాలన్నదే ప్రజల అభిమతమని వ్యాపారవర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
This website uses cookies.