Categories: NewsTelangana

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Advertisement
Advertisement

Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం (ఎం) మండల కేంద్రంలోని జెడ్పీ పాఠశాలలో జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి పాల్గొన్న ఆయన, పలువురు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ధరణి చట్టం వల్ల పలు సమస్యలు ఎదురయ్యాయని, వాటికి పరిష్కారంగా కొత్త భూభారతి–2025 చట్టం తీసుకొచ్చామని తెలిపారు. గ్రామాల్లో ఇళ్లకు సంబంధించి ఆబాదీ భూములకు డాక్యుమెంట్లు ఇవ్వనున్నామని హామీ ఇచ్చారు.

Advertisement

Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ ఇళ్ల పై పొంగులేటి కీల‌క అప్‌డేట్‌..!

Ponguleti Srinivasa Reddy : రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి వద్ద ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు

రాష్ట్రవ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన పెంచేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఇదే సందర్భంగా రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామకృష్ణారావు పేర్కొన్నారు. వెంకటాపురం సదస్సులో 746 దరఖాస్తులు స్వీకరించామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ధరణి చట్టంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. తమ భూములు రికార్డుల్లో ఉండి కూడా తొలగించారని వాపోయారు. ధరణిలో ఎక్కించేందుకు ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగామని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

పట్టా లేకపోవడంతో ఎన్నో ప్రభుత్వ పథకాలు అందకుండా పోయాయని కొందరు మహిళా రైతులు పేర్కొన్నారు. భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో జీవిస్తున్న తాను ఎన్నిసార్లు కలెక్టర్ కార్యాలయం తిరిగినా పట్టా రాలేదని ఓ మహిళ పేద్దగా కన్నీరు పెట్టుకుంది. భూభారతి చట్టంతోనైనా తమకు న్యాయం జరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తాజా ప్రకటనలతో పేదలకి భరోసా కలుగుతుందని, భూ సమస్యలు లేకుండా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

Recent Posts

Rajitha Parameshwar Reddy : ఉప్పల్ భ‌ర‌త్‌న‌గ‌ర్ మాల‌బ‌స్తీలో రూ.1.70 కోట్ల‌తో అభివృద్ధి పనులు.. : ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌ రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ డివిజ‌న్ Uppal Division స‌మ‌గ్రాభివృద్ధికి కృషి చేస్తున్న‌ట్టుగా కార్పొరేట‌ర్ మందుముల ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి  Rajitha…

46 minutes ago

Raashii Khanna : మైమ‌రిపించే అందాల‌తో మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న రాశీ ఖ‌న్నా.. ఫొటోలు వైర‌ల్

Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖ‌న్నా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…

2 hours ago

Boy Saved 39 Acres : ఒక్క లెటర్ తో 39 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండ సేవ్ చేసిన బాలుడు..!

Boy Saved 39 Acres : హైదరాబాద్‌లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…

3 hours ago

Vitamin D : దాంపత్య జీవితానికి ఈ విటమిన్ లోపిస్తే… అందులో సామర్థ్యం తగ్గుతుందట… ఇక అంతే సంగతులు…?

Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…

4 hours ago

Saree Viral Video : ఓహ్..ఈ టైపు చీరలు కూడా వచ్చాయా..? దేవుడా..?

Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…

5 hours ago

Raj Tarun – Lavanya : రాజ్ తరుణ్- లావణ్య కేసులో సంచలన ట్విస్ట్..!

Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…

6 hours ago

Chandrababu : చంద్రబాబు జన్మదిన వేడుకలు .. వేలిముద్రలతో చంద్రబాబు చిత్రం.. కుప్పం మహిళల మజాకా..!

Chandrababu  : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…

7 hours ago

Yellamma Movie : రంగ్ దే కాంబో రిపీట్ చేస్తున్న జ‌బ‌ర్ధ‌స్త్ వేణు.. ఎల్ల‌మ్మ‌పై భారీ అంచ‌నాలు..!

Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్‌బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్ర‌స్తుతం…

8 hours ago