Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
Aarogyasri : తెలంగాణలో ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు Aarogyasri నిలిపివేస్తామని నెట్వర్క్ ఆస్పత్రులు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. బకాయిలు చెల్లించకపోవడమే ఇందుకు కారణంగా తెలిపాయి. తమ సమస్యలు పరిష్కరించక పోతే జనవరి 10 నుంచి వైద్య సేవల్ని నిలిపివేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సీఇవోకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించాయి. ఆరోగ్యశ్రీతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్), జర్నలిస్టు హెల్త్ స్కీమ్ (జేహె చ్ఎస్)లలో కూడా భారీగా బకాయిలు ఉన్నాయని తెలిపాయి.
Aarogyasri : తెలంగాణలో ఈ 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
పెండింగ్ బకాయిల వల్ల ఆస్పత్రులు ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నాయని తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల ఆసోసియేషన్ (తానా) పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యశ్రీ సేవ లను కొనసాగించే పరిస్థితి లేదని స్పష్టం చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని తానా చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో 9 నెలల బకాయిలు రూ.672 కోట్లు పెండింగ్లో ఉండగా కాంగ్రెస్ వచ్చాక అది మరింత పెరిగిందని చెబుతున్నారు.
గతంలో మొదట బిల్లులు పెట్టిన వారికే మొదట చెల్లింపు (ఫస్ట్ క్లెయిమ్, ఫస్ట్ పేమెంట్) తరహా పద్దతి ఉండేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులో మొదట ప్రభుత్వ ఆస్పత్రులకు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడంతో ఆస్పత్రులు నడిపే పరిస్థితి లేదని తెలంగాణ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ చెబుతోంది. ప్రభుత్వం మాత్రం గత వారం కూడా రూ.40 కోట్లు విడుదలైందని, బకాయిలు రూ.400 కోట్లకు మించి ఉండవని చెబుతోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.