Bhu Bharati : కొత్త ఫీచర్తో భూ భారతి.. ఏ మార్పు చేయాలన్న రైతు ఆమోదం తప్పని సరి..!
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ మార్పులను అడ్డుకునేందుకు, భూముల రికార్డుల్లో ఏ మార్పు జరిగినా వెంటనే భూమి యజమానులకు సమాచారం వెళ్లేలా భూ భారతి పోర్టల్ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మొబైల్ యాప్ను కూడా రూపొందించేందుకు సాంకేతిక బృందాలు కసరత్తు చేస్తున్నాయి. భూ మార్పులకు యజమాని అంగీకారం తప్పనిసరి చేసే విధంగా సిస్టమ్ను డిజైన్ చేయడం ద్వారా అధికారుల ఇష్టారాజ్యాన్ని నిరోధించే ప్రయత్నం జరుగుతోంది.
Bhu Bharati : కొత్త ఫీచర్తో భూ భారతి.. ఏ మార్పు చేయాలన్న రైతు ఆమోదం తప్పని సరి..!
ఇక ధరణి పోర్టల్ ద్వారా గతంలో అనేక భూములు ఉద్దేశ్యపూర్వకంగా నిషేధిత జాబితాలో చేరిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ను నిలిపివేయాలన్న ఉద్దేశంతో కొంతమంది అధికారి, ప్రబలుల సహకారంతో రైతుల భూములను బ్లాక్ చేయించారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, గండిపేట, కేశంపేట వంటి ప్రాంతాల్లో వేల ఎకరాల భూములపై వివాదాలు ఉన్నాయి. ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా వాటిపై విచారణ కొనసాగుతుండగా, భూ భారతి ద్వారా ఇకపై ఆచరణాత్మకంగా రికార్డులను మార్పు చేయడాన్ని కఠినతరం చేయనున్నారు.
యూజర్ ఫ్రెండ్లీ విధానంతో భూ భారతి పోర్టల్ను అభివృద్ధి చేస్తున్నారు. పాత ధరణి పోర్టల్లో ఉన్న 35 మాడ్యూల్స్ బదులుగా, భూమి సంబంధిత అన్ని సేవలను ఏడు ప్రధాన మాడ్యూల్స్లో సమీకరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆర్వోఆర్ కరెక్షన్, నిషేధిత జాబితా, మార్కెట్ విలువలు, అప్పీల్ అండ్ రివిజన్ వంటి అంశాలన్నీ ఈ పోర్టల్లో పొందుపరిచారు. భవిష్యత్తులో భూ రక్షక్, భూధార్ యాప్లను కూడా అందుబాటులోకి తీసుకొస్తూ, భూములపై ప్రజలకు మరింత సమగ్ర సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం తీసుకుంటున్న ఈ చర్యలు భవిష్యత్తులో భూ వ్యవహారాల్లో న్యాయాన్ని తీసుకురావడంలో కీలకంగా మారనున్నాయి.
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
This website uses cookies.