Categories: NewsTelangana

Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

Advertisement
Published by
Advertisement

Revanth Reddy : రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు Godavari waters  అందకుండా మాజీ సీఎం కేసీఆర్ KCR అడ్డుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి CM Revanth Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన కేసీఆర్ తెలంగాణ ప్రయోజనాలకంటే పక్క రాష్ట్రాలకే ఎక్కువగా పనిచేశారని అన్నారు. గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఏటా సుమారు 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే వాటిలో కనీసం 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు మళ్లించి ఉంటే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందేదని ప్రశ్నించారు. ఈ అవకాశాన్ని వదిలేసి జిల్లాను ఎండబెట్టారని ఆరోపించారు.

Advertisement

Revanth Reddy : బ్రేకింగ్‌న్యూస్‌ .. పక్క రాష్ట్రం కోసమే కేసీఆర్ పనిచేశారు : సీఎం రేవంత్‌రెడ్డి ఘాటు విమర్శలు

Revanth Reddy : రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి

తమ ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి  Welfare and development సమాంతరంగా కొనసాగుతున్నాయని సీఎం స్పష్టం చేశారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజాపాలన సాగిస్తున్నామని చెప్పారు. అప్పులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. ఎన్నికల్లో ప్రజల ముందు నిలబడి పోటీ చేయాల్సిన బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బొందపెట్టారని, కాంగ్రెస్‌తో నేరుగా పోటీ చేయలేక బీజేపీతో కలిసిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ అభ్యర్థుల బీఫామ్‌లు బీఆర్‌ఎస్ కార్యాలయాల్లో పంచే దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Revanth Reddy : కాళేశ్వరం నుంచి ‘కూలేశ్వరం’ వరకు

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు  Pranahita Chevella Project ను నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి  YS Rajasekhar Reddy రూ.38 వేల కోట్లతో ప్రారంభించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. అయితే కేసీఆర్ సీఎం అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలోని కీలక ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ నాయకుడినని చెప్పుకున్న కేసీఆర్ అదే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే ‘కూలేశ్వరం’గా మారిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు మేలు కాకుండా కేసీఆర్ కుటుంబానికి ఫామ్‌హౌస్‌లు మాత్రమే వచ్చాయని గోదావరి జలాల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. గోదావరి జలాలను తీసుకువచ్చి తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాలను సస్యశ్యామలం చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని సీఎం హామీ ఇచ్చారు. ఈ సభలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు సహా స్థానిక నేతలు పాల్గొన్నారు.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Assembly Seats  : తెలుగు రాష్ట్రాల్లో 100కు పైగా కొత్త అసెంబ్లీ సీట్లు.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Assembly Seats  : తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…

59 minutes ago

Sharwanand Biker Movie First Review : శర్వానంద్ ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. ఇండియాలోనే తొలి ప్రయత్నం, బ్లాక్ బస్టర్ గ్యారెంటీ!

Sharwanand Biker Movie First Review : టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ కెరీర్ ఇప్పుడు సరికొత్త…

2 hours ago

Varanasi Sets : వారణాసి సెట్స్ లీక్‌ .. భారీ బడ్జెట్‌తో భారీ విజన్ .. వీడియో వైరల్‌ .. !

Varanasi Sets : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై…

3 hours ago

Hyderabad : యుద్ధ ప్రభావం .. హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల వద్ద వాహనదారుల రద్దీ ..!

Hyderabad : ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్,…

4 hours ago

LPG Gas : ఎల్‌పీజీ, ఇండక్షన్, ఎయిర్ ఫ్రైయర్ లేదా మైక్రోవేవ్ .. వీటిలో వంటలకు ఏది బెస్ట్? .. చవకైనది ఏదో తెలుసా ?

LPG Gas : ఒకప్పుడు కట్టెల పొయ్యిల నుంచి ఎల్‌పీజీకి మారడం పెద్ద మార్పుగా భావించేవారు. అది శుభ్రత, సౌలభ్యం,…

4 hours ago

Karthika Deepam 2 March 25th 2026 Episode : జ్యోత్స్న కిడ్నాప్ కుట్ర బయటపెట్టిన కార్తీక్.. సుమిత్రకు ప్రాణాపాయం

Karthika Deepam 2 March 25th 2026 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2'…

6 hours ago

Raw Mango : సమ్మర్‌లో పచ్చి మామిడి మహిమలు .. రుచితో పాటు ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ..!

Raw Mango : వేసవి కాలం వచ్చిందంటే చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చేది పచ్చి మామిడి రుచి. మామిడి పేరు…

7 hours ago

Water Summer : వేసవిలో నీళ్లు ఎంత తాగాలి ? .. ఎక్కువ తాగితే వచ్చే ప్రమాదాలేమిటో తెలుసా ?

Water Summer  : వేసవికాలం రాగానే శరీరం వేడికి గురై చెమటలు అధికంగా పడటం సహజం. ఈ ప్రక్రియలో శరీరంలోని…

8 hours ago

zodiac signs : అతి త్వరలో కుజ గ్రహం సంచారం .. ఈ మూడు రాశులకు అదృష్ట జ్యోతి .. భారీగా బంగారం కొనుగోలు ..!

zodiac signs : కుజ గ్రహం శక్తి, ధైర్యం, సంకల్పానికి ప్రతీకగా జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఒకరి…

9 hours ago

Jupalli Ramu Rao : యువత ప్రతిభే దేశ బలం.. TV9 WITT సమ్మిట్‌లో జూపల్లి రాము రావు… ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ

Jupalli Ramu Rao  : న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్…

17 hours ago

India – Pak : యుద్ధం మధ్యలో భారత్ అగ్ని 6 ఎంట్రీ .. ఉలిక్కిపడ్డ పాక్ , అమెరికా..!

India - Pak : ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ప్రపంచ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు కొన్ని దేశాలు…

18 hours ago