
#image_title
CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ ను తెగ మెచ్చుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ పై తొలిసారి స్పందించిన సీఎం కేసీఆర్.. చంద్రబాబుకు సీఎం జగన్ ఉచ్చపోయిస్తున్నాడని చెప్పుకొచ్చారు. పాత ఏపీ అయినా.. ఇప్పటి తెలంగాణ, ఏపీ అయినా తెలుగు ప్రజానీకానికి గోదావరి, కృష్ణలో ఉన్న కేటాయింపు అందరికీ తెలిసిందే. 1480 టీఎంసీలు గోదావరిలో కేటాయింపులు ఉన్నాయి. తెలంగాణ, ఏపీకి కలిపి. అలాగే.. 811 టీఎంసీలు కృష్ణకు కేటాయింపులు ఉన్నాయి. రెండు కలిపినప్పుడు సుమారు 2300 టీఎంసీల నీళ్లు మనకు కేటాయించారు. తెలుగు రాష్ట్రాల తర్వాత మిగిలింది బంగాళాఖాతమే కాబట్టి మిగులు జలాలు కూడా మీరే వాడుకోవచ్చని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది.
సుమారు 3000 టీఎంసీల పైచిలుకు నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. 4000 వరకు కూడా వెళ్తున్నాయి ఒక్కోసారి. కృష్ణలో శ్రీశైలం దగ్గర గేజ్ చూస్తాం. 1200 పైచిలుకు శ్రీశైలం నుంచి వస్తాయి. యావరేజ్ తీస్తే ఈ రకంగా యావరేజ్ ఉంది. సుమారుగా 4700 టీఎంసీల నీళ్లు రెండు రాష్ట్రాలు కలిపి వాడుకోవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు కయ్యం పెట్టుకొని తెలుగు ప్రజలు నష్టపోయారు. ఇప్పుడు అలా పని లేదు. కీచులాటలు అవసరం లేదు. కేంద్రం కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులం అదే మాట్లాడుకున్నాం. అందుకే రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న సుమారు 5000 టీఎంసీల నీళ్లను తెలంగాణ, ఏపీలో ప్రతి గ్రామానికి వెళ్లేలా చేయాలని నిర్ణయించాం. ఆ విధంగా మంచి పరిణామం జరుగుతోంది. రాష్ట్ర విభజన అంశాలు కావచ్చు.. ఇంకా ఏవేవో ఉన్నాయి. పరస్పరం అవసరాలు చాలా ఉంటాయి. శాంతి భద్రతల అవసరాలు కావచ్చు.. ఇరుగు పొరుగున ఉండేవాళ్లు ఖచ్చితంగా అవన్నీ సహకరించుకోవాలి అంటూ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఏపీలో తొలిసారి అధికారంలోకి వచ్చిన జగన్.. బాగానే పాలిస్తున్నాడు. ఏపీ సహకరిస్తేనే కృష్ణ, గోదావరి జలాల సమస్య పరిష్కారం అవుతుంది. రెండు రాష్ట్రాలకు కావాల్సిన నీళ్లు అందాలంటే రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలి. లేకపోతే రెండు రాష్ట్రాలు నష్టపోవడమే కాదు.. ఆ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలుస్తాయి అని సీఎం కేసీఆర్ అన్నారు.
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
This website uses cookies.