
#image_title
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఒకే ఒక్క సినిమా పుష్పతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. చివరకు నేషనల్ అవార్డు కూడా పొందాడు. పుష్ప సినిమాలో తన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఉత్తమ నటుడిగా అవార్డు పొందడం, ఇటీవలే రాష్ట్రపతి నుంచి అవార్డు కూడా తీసుకున్నాడు. ఢిల్లీలో అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ మురిసిపోయింది. అయితే.. ఇదే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన దేవిశ్రీప్రసాద్ కు కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఈనేపథ్యంలో అవార్డులు తీసుకున్న తర్వాత పుష్ప మూవీ యూనిట్ సెలబ్రేటింగ్ నేషనల్ అవార్డు అనే ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.
ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్ లో ఒక లేవల్ కు వచ్చినప్పుడు, ఒక మైల్ స్టోన్ కు చేరినప్పుడు ఒక విషయం తెలుసుకుంటాను. అది అందరితో షేర్ చేసుకుంటాను. మనం ఏం కోరుకుంటే అది జరుగుతుంది. నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే.. అది అంతా 50 శాతం మాత్రమే.. మనం ఎంత చేసినా అది 50 శాతమే. కానీ.. మన చుట్టూ ఉన్నవాళ్లంతా కూడా కోరుకుంటే.. పాజిటివ్ ప్రజలు నా వెంట ఉంటే అప్పుడే అది నెరవేరుతుంది. వాళ్లందరూ కోరుకున్నారు కాబట్టే నేషనల్ అవార్డు వచ్చింది. నాకు నేషనల్ అవార్డు రావాలని కోరిక ఉంది. కానీ.. నాకంటే సుకుమార్ కి ఎక్కువ కోరిక ఉంది. నానుంచి వచ్చింది కానీ.. ఆ అవార్డు నిజానికి ఆయనకే వచ్చింది అంటూ ఎమోషనల్ అయ్యాడు అల్లు అర్జున్.
సుకుమార్ ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయన ఇక్కడ లేకపోయినా ఉన్నట్టే. ఈ సందర్భంగా నేను ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఒక సీన్ షూట్ చేశాం. అయిపోయింది వచ్చేశాం. సెకండ్ షెడ్యూల్ కోసం మళ్లీ మారెడుమల్లికి వెళ్లినప్పుడు మళ్లీ అదే సీన్ ను షూట్ చేశాం. ధర్డ్ షెడ్యూల్ అప్పుడు మళ్లీ అక్కడికే వెళ్దాం అన్నాడు. ఎందుకు రెండు సార్లు చేశాం కదా. మళ్లీ మూడోసారి ఎందుకు.. రిస్క్ అంటే బన్నీ ఈ సినిమా నాకు ఎంత పేరు వస్తుంది.. డైరెక్టర్ గా ఎంత పేరు వస్తుంది.. ఎంత డబ్బు వస్తది అనేది నాకు అనవసరం. ఈ సినిమా పేరు మీద నీకు ఎంత పర్ ఫార్మెన్స్ వస్తుంది.. అదొక్కటి తప్ప నాకు ఏం వద్దు అని సుకుమార్ చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నాకు పర్ ఫార్మెన్స్ వస్తే వాళ్లకు ఏం వస్తది. ఇదంతా ఆయన వల్లనే జరిగింది అని బన్నీ చెప్పుకొచ్చారు.
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
H1B Visa : అమెరికాలో విదేశీ నిపుణుల నియామకాలకు సంబంధించిన H1B వీసా విధానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విదేశీ…
Boduppal : బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మాజీ మేయర్ తోటకూర అజయ్…
Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.…
Gundlapochampally : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని గుండ్లపోచంపల్లి, మైసమ్మగూడ పరిసర ప్రాంతాల్లో ఎస్సీ కార్పొరేషన్కు కేటాయించిన భూములు ఆక్రమణలకు గురయ్యాయన్న ఆరోపణల…
Weather Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. గత కొన్ని వారాలుగా తీవ్ర ఎండలతో…
FIFA 2026 : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది అభిమానులు కలిగిన క్రీడల్లో ఫుట్బాల్ అగ్రస్థానంలో ఉంటుంది. భారత్లో క్రికెట్కు ఉన్న…
Father Pension Money : హైదరాబాద్లో సంచలనం సృష్టించిన పెన్షన్ హత్య కేసులో మల్కాజిగిరి కోర్టు కీలక తీర్పు వెలువరించింది.…
29 Movie Review : ఓటీటీ వేదికల్లో ఇటీవలి కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సినిమాల్లో ‘29’ ఒకటి. తమిళంలో విడుదలైన…
This website uses cookies.