CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు... కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలలో భాగంగా ఇటీవల నారాయణపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రధాని మోడీకి తాకట్టు పెట్టాడని తెలిపారు. పాలమూరు జిల్లాలో బీజేపీ కి ఓట్లు వేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులను , సొంత పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా చేవెళ్లలో కూడా బీఆర్ఎస్ లీడర్లను బీజేపీకి లొంగిపొమ్మని చెబుతున్నారు.
CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
భువనగిరి , మల్కాజ్గిరి, జహీరాబాద్, చేవెళ్ల ,మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ధోరణి వినిపిస్తోంది. అయితే ఈ ఐదు స్థానాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం. అందుకే ఆ స్థానాలలో కాంగ్రెస్ ని దెబ్బతిస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అనే ఆలోచనలో మోడీ కేసీఆర్ నడుస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. నా మీద కోపం ఉంటే నాతో కొట్లాడండి , మా కార్యకర్తలతో కొట్లాడండి మేము తప్పు చేసి ఉంటే ప్రజలకు తెలిసేలా చెప్పండి అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే 100 రోజుల పాలనలోనే నన్ను గద్దే దించాలని కేసీఆర్ అంటున్నాడు. మరి 10 ఏళ్లుగా గద్దే మీద ఉన్న మోదీని ఎందుకు గద్దే దించాలి అనుకోట్లే అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పనులు చేసింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాని ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన కొన్ని హామీలను నెరవేర్చలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కానీ ఈ లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకి కచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట గడ్డపై నిలబడి చెబుతున్నానంటూ ఎన్నికల ముగిసిన తర్వాత ఆగస్టు 15 లోపు కచ్చితంగా ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీ అందుకుంటారంటూ చెప్పుకొచ్చారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.