CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు... కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీలకు దీటుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తూ దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలలో భాగంగా ఇటీవల నారాయణపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ప్రధాని మోడీకి తాకట్టు పెట్టాడని తెలిపారు. పాలమూరు జిల్లాలో బీజేపీ కి ఓట్లు వేయాల్సిందిగా బీఆర్ఎస్ నాయకులను , సొంత పార్టీ కార్యకర్తలను కోరుతున్నట్లుగా తెలియజేశారు. అదేవిధంగా చేవెళ్లలో కూడా బీఆర్ఎస్ లీడర్లను బీజేపీకి లొంగిపొమ్మని చెబుతున్నారు.
CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
భువనగిరి , మల్కాజ్గిరి, జహీరాబాద్, చేవెళ్ల ,మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా ఇదే రకమైన ధోరణి వినిపిస్తోంది. అయితే ఈ ఐదు స్థానాలలో కాంగ్రెస్ గెలుపు ఖాయం. అందుకే ఆ స్థానాలలో కాంగ్రెస్ ని దెబ్బతిస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అనే ఆలోచనలో మోడీ కేసీఆర్ నడుస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. నా మీద కోపం ఉంటే నాతో కొట్లాడండి , మా కార్యకర్తలతో కొట్లాడండి మేము తప్పు చేసి ఉంటే ప్రజలకు తెలిసేలా చెప్పండి అంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. అలాగే 100 రోజుల పాలనలోనే నన్ను గద్దే దించాలని కేసీఆర్ అంటున్నాడు. మరి 10 ఏళ్లుగా గద్దే మీద ఉన్న మోదీని ఎందుకు గద్దే దించాలి అనుకోట్లే అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
CM Revanth Reddy : దమ్ముంటే మగాడివైతే నాతో కొట్లాడు… కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్..!
తెలంగాణ రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పనులు చేసింది. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాని ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన కొన్ని హామీలను నెరవేర్చలేకపోతున్నానంటూ ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేశారు. కానీ ఈ లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులకి కచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతానంటూ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట గడ్డపై నిలబడి చెబుతున్నానంటూ ఎన్నికల ముగిసిన తర్వాత ఆగస్టు 15 లోపు కచ్చితంగా ప్రతి రైతు 2 లక్షల రుణమాఫీ అందుకుంటారంటూ చెప్పుకొచ్చారు.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.