
cm revanth reddy vs kavith in telangana council
Revanth Reddy VS Kavitha : నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకు, ఆఖరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు. నేను ఎక్కువ లోతుకు వెళ్లదలుచుకోలేదు. లక్షా 50 వేల కోట్ల ప్రతిపాదనలతో లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం పగిలిపోయింది. మన కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తోంది. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కడితే ఇసుక కదిలింది. మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకు తెలియదు. మేమూ నాగార్జున సాగర్ కట్టినం. మేమూ శ్రీశైలం కట్టినం. మేమూ జూరాల కట్టినం. మేమూ శ్రీరాంసాగర్ కట్టినం. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడ్డ ప్రాజెక్టులు అవి. కళ్లముందు సజీవంగా ఉన్నాయన్నారు. కానీ.. మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది. అయినా కూడా ఇంకా మేము ప్రాజెక్టులు కట్టాం అని చెబుతున్నారు. రైతులకే ఈ ప్రాజెక్టుల దగ్గరికి సందర్శనకు పంపించండి. మంత్రి గారిని అనుమతి అడుగుతున్నా. మాకు అందరికీ అక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్న అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను సందర్శనకు తీసుకెళ్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి.
దీంతో అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. విచారణ చేసుకోవచ్చు కదా అని వెంటనే ఎమ్మెల్సీ కవిత అనడంతో తప్పకుండా మీ సూచనను తీసుకుంటాం. ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం. ఈరకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం. జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. దీంతో కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదే పదే ఆ విషయాన్ని చెబుతున్నారు. తప్పు జరిగితే తప్పును నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు. అదేం టూరిస్టు కాదు.. అక్కడికి సందర్శనకు తీసుకెళ్లడానికి అంటూ కవిత అనడంతో ఇక్కడ ఉన్న సభ్యులకు అపోహలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి. అందుకే వాళ్లను అందరినీ అక్కడికి తీసుకెళ్తామని చెబుతున్నాం. ఆ సభ్యురాలికి ఏంటి సమస్య అనేది నాకు అర్థం కావడం లేదన్నారు.
ఏ విచారణ అయినా, విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరు అని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అనే విధానం ఉండదు. నిస్పక్షపాత విచారణ చేస్తాం. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మగారం పున:ప్రారంభించాలని కోరుతున్నారు. మా ప్రభుత్వం నిజాం చక్కెర కర్మగారాలను తెరిపించడానికి కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండటానికి ఆఫీసర్స్ కమిటీ, మినిస్టర్స్ కమిటీ వేసి వాళ్ల నుంచి నివేదిక తీసుకొచ్చి తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
This website uses cookies.