cm revanth reddy vs kavith in telangana council
Revanth Reddy VS Kavitha : నీళ్ల గురించి, ప్రాజెక్టుల గురించి తెలంగాణ రైతులకు చివరి ఎకరాకు, ఆఖరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని, ఇంకెంత కాలం తెలంగాణ ప్రజలను మభ్యపెడతారు. నేను ఎక్కువ లోతుకు వెళ్లదలుచుకోలేదు. లక్షా 50 వేల కోట్ల ప్రతిపాదనలతో లక్షా 2 వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం పగిలిపోయింది. మన కళ్ల ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తోంది. మన పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కడితే ఇసుక కదిలింది. మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజీలు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకు తెలియదు. మేమూ నాగార్జున సాగర్ కట్టినం. మేమూ శ్రీశైలం కట్టినం. మేమూ జూరాల కట్టినం. మేమూ శ్రీరాంసాగర్ కట్టినం. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడ్డ ప్రాజెక్టులు అవి. కళ్లముందు సజీవంగా ఉన్నాయన్నారు. కానీ.. మూడేళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయింది. అయినా కూడా ఇంకా మేము ప్రాజెక్టులు కట్టాం అని చెబుతున్నారు. రైతులకే ఈ ప్రాజెక్టుల దగ్గరికి సందర్శనకు పంపించండి. మంత్రి గారిని అనుమతి అడుగుతున్నా. మాకు అందరికీ అక్కడికి వచ్చే ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్న అసెంబ్లీ, కౌన్సిల్ సభ్యులను సందర్శనకు తీసుకెళ్తా. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి.
దీంతో అంతా మీ చేతుల్లోనే ఉంది కదా. విచారణ చేసుకోవచ్చు కదా అని వెంటనే ఎమ్మెల్సీ కవిత అనడంతో తప్పకుండా మీ సూచనను తీసుకుంటాం. ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తాం. ఈరకంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే ఖచ్చితంగా చేస్తాం. జీవన్ రెడ్డి కూడా అదే చెప్పారు. వారి సూచనలను పరిగణనలోకి తీసుకొని విచారణకు ఆదేశిస్తాం అన్నారు రేవంత్ రెడ్డి. దీంతో కవిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదే పదే ఆ విషయాన్ని చెబుతున్నారు. తప్పు జరిగితే తప్పును నిర్ధారించాల్సింది మనం కాదు నిపుణులు. అదేం టూరిస్టు కాదు.. అక్కడికి సందర్శనకు తీసుకెళ్లడానికి అంటూ కవిత అనడంతో ఇక్కడ ఉన్న సభ్యులకు అపోహలు ఉన్నాయి. అనుమానాలు ఉన్నాయి. అందుకే వాళ్లను అందరినీ అక్కడికి తీసుకెళ్తామని చెబుతున్నాం. ఆ సభ్యురాలికి ఏంటి సమస్య అనేది నాకు అర్థం కావడం లేదన్నారు.
ఏ విచారణ అయినా, విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరు అని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది. నచ్చితే నజరానా.. నచ్చకపోతే జరిమానా అనే విధానం ఉండదు. నిస్పక్షపాత విచారణ చేస్తాం. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మగారం పున:ప్రారంభించాలని కోరుతున్నారు. మా ప్రభుత్వం నిజాం చక్కెర కర్మగారాలను తెరిపించడానికి కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండటానికి ఆఫీసర్స్ కమిటీ, మినిస్టర్స్ కమిటీ వేసి వాళ్ల నుంచి నివేదిక తీసుకొచ్చి తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాం అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Journalist Krishnam Raju : రాజధాని అమరావతి మహిళలపై సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న జర్నలిస్ట్ కృష్ణంరాజు మరోసారి…
Today Gold Rate : గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఇప్పుడిప్పుడే కొంత తగ్గుతూ వస్తుంది.…
XChat : సంచలన ప్రకటనలు , సంచలన ప్రయోగాలు చేస్తూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ Elon Musk ..తాజాగా…
Niloufer Hospital : ప్రస్తుత సమాజంలో వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. ఎన్నో రకాల వ్యాధులకు రక్త నమూనాతో పరీక్షలు…
Kilimin Fish : మనకు కొన్ని ప్రత్యేకమైన చేపలు సముద్రంలో కనిపిస్తాయి. ఈ సముద్రంలో జీవించే ఒక ప్రత్యేకమైన చేప.…
Health Benefits Of Coffee : సాధారణంగా కొందరు కాఫీ ని ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడతారు. కాఫీ శరీరానికి ఎంతో సహజమైన…
Zodiac Signs : సంవత్సరంలో ని మాసాలలో పవిత్రమైన మాసం కార్తీక మాసంగా పేర్కొన్నారు. ఆ తరువాత మహావిష్ణువు జోష్ణ…
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
This website uses cookies.