
CM Revanth Reddy : నిబద్ధత కలిగిన అధికారులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది.. సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ Civil Service అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అధికారులు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుంటారని చెప్పారు. IAS Officers ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ గారు రాసిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి’ (Life of a Karma Yogi) పుస్తకాన్ని ముఖ్యమంత్రి CM Revanth reddy గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఆ కారణంగానే రాజకీయ నాయకుల కంటే అధికారులనే ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకునే వారు. ముఖ్యంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ కొందరు కలెక్టర్లు ఏసీ రూములను వదిలి బయటకు వెళ్లడం లేదు. కలెక్టర్లు, ఎస్పీలకు జిల్లా స్థాయిలో గడించే అనుభవమే కీలకమవుతుంది.
CM Revanth Reddy : నిబద్ధత కలిగిన అధికారులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది.. సీఎం రేవంత్ రెడ్డి
అధికారుల్లో మార్పు రావలసిన అవసరం ఉంది. నిబద్ధత కలిగిన అధికారులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలోని అంశాలను విశ్లేషించి వివరించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులదే. బిజినెస్ రూల్స్ వివరించాలి. కొందరు వాటిని విస్మరిస్తున్నారు. అది సమాజానికి మంచిది కాదు. అధికారుల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి. ఎంతో నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్ గారు, పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ గారు, దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ లాంటి వారి అనుభవాల నుంచి కొత్తగా సర్వీసులో చేరుతున్న సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది.
ఆరు దశాబ్దాల అనుభవాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. మనం ఏదైనా కొనొచ్చు. కానీ అనుభవాన్ని కొనలేం. సివిల్ సర్వెంట్స్ అందరికీ గోపాలకృష్ణ గారి పుస్తకం వెలకట్టలేనిది. అందరికీ ఒక దిక్సూచిగా ఉంటుంది. తొలి ప్రధానమంత్రి నెహ్రూ గారి కాలం నుంచి నేటి ప్రధాని మోదీ గారి వరకు అనుభవం కలిగిన గోపాలకృష్ణ గారు.. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు దేశంలో మార్పులకు ప్రత్యక్ష సాక్షి. భవిష్యత్తును కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు” అని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, అసోసియేషన్ వైస్-ప్రెసిడెంట్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు గారితో పాటు పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.