Kashmir Pahalgam : రామంతాపూర్లో కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన .. పహల్గాం దాడి మృతులకు నివాళి..!
ప్రధానాంశాలు:
Kashmir Pahalgam : రామంతాపూర్లో కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన .. పహల్గాం దాడి మృతులకు నివాళి..!
Kashmir Pahalgam : కాశ్మీర్లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడిని Uppal Congress ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మందుముల పరమేశ్వర్రెడ్డి mandumula parameshwar reddy తీవ్రంగా ఖండించారు. ఉగ్ర మూఖల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు నివాళిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామంతాపూర్ భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన చేపట్టారు.

Kashmir Pahalgam : రామంతాపూర్లో కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన .. పహల్గాం దాడి మృతులకు నివాళి..!
Kashmir Pahalgam పహల్గాం దాడి మృతులకు నివాళి
ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్యగా ఈ సందర్భంగా పరమేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఉగ్ర మూఖలు చేసిన చీకటి దాడిలో అమాయకులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. దొంగ దెబ్బ తీసిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోఫిక్ గారు ,ఉప్పల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్,రామంతాపూర్ డివిజన్ అధ్యక్షులు రఫిక్,సుర్వి మురళి గౌడ్,వాళ్ళపు శ్రీకాంత్ యాదవ్,హబ్షిగూడ డివిజన్ అధ్యక్షులు విజయ్,జలీల్ పాష,గరిక సుధాకర్,పేట మురళి ముదిరాజ్,ఉపేందర్ రెడ్డి ,సందీప్ ,నామ్ రాజీ రెడ్డి ,సతీష్ గౌడ్,ముత్యాల బాబు, ముత్యాల జంగయ్య, ,అజ్మత్ పాషా, సతీష్ గౌడ్, బుక్కా సురేష్,భాస్కర గంగా పుత్ర, అశోక్, సందీప్,భాస్కర్, షాగా శ్రీధర్, సచీన్ ,కాషమల్ల శంకర్, శోభ, అంబిక ,గాయత్రి ,,చింటు ,నాగమల్లయ, కే స్వామి, జీ స్వామి, షకీల్ ,అలీమ్,లూకాస్, సత్తిరెడ్డి,అరుణ్ సాయి, ఎస్ జంగయ్య, సత్తాన్న, సలీంపాల్గొన్నారు