Home » Exclusive » Door To Door Survey For Six Guarantee Schemes Get Them Ready
Exclusive

Six Guarantee Schemes : 6 గ్యారెంటీ స్కీమ్ ల కోసం ఇంటింటికి సర్వే… వీటిని రెడీగా పెట్టుకోండి..!

Authored By
aruna
The Telugu News | Published on: February 4, 2024, 8:00 am
Advertisement

Six Guarantee Schemes : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా ఆరు గ్యారెంటీ స్కీం లకు అయితే ఒక స్టెప్పు ముందుకు పడింది అని అనుకోవచ్చు… ఈ ఆరు గ్యారెంటీల స్కీముల కోసం ఇంటింటికి సర్వే చేయాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ అప్లికేషన్స్ అప్లై చేసుకున్న వారు కి అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు ఇంటింటికి సర్వే మొదలుపెట్టింది. దానివల్ల దరఖాస్తులు తమ ఇళ్లల్లో ఏమి కలిగి ఉండాలి. ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను అలాగే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఈ రెండిటిని అమలు చేసింది. మరో రెండు పథకాలు అమలు చేయడానికి రెడీగా ఉంది. అవి వచ్చేసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు. అలాగే 500 కి గ్యాస్ సిలిండర్ కూడా అమలు చేయాలని ప్రాణాలికలు వేస్తున్నట్లయితే తెలుస్తోంది. అయితే ఈ పథకాలను ఎవరెవరికి ఎంపిక చేయాలని అంశంపై తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్లో అభయస్తం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అయితే దీనికోసం తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది తొందరలో ఈ అప్లికేషన్ల దారుల ఇంటికి వెళ్లి సర్వే చేయనున్నారు.

Advertisement

ఆ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. అయితే ఇంటికి వచ్చే అధికారులు దరఖాస్తుల నుంచి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నారని సమాచారం. దరఖాస్తులు ఇచ్చిన అందరి లబ్ధిదారులను సర్వే చేయడం జరుగుతుంది. అయితే దీనికోసం కొన్ని ఐడి ప్రూఫ్ లు కూడా చూపించాలని కోరుతారు. దానివల్ల అప్లై చేసుకున్న వారు తమ దగ్గర అన్ని ఐడీలు ప్రూపులను సిద్ధంగా పెట్టుకోవడం చాలా ముఖ్యం.తెలంగాణ ప్రభుత్వం సిబ్బంది ఎప్పటినుంచి డోర్ టు డోర్ సర్వే చేస్తారు. ఇంకా డేట్ అనేది ప్రకటించలేదు. అయితే వారు వచ్చినప్పుడు మాత్రం సర్వే చాలా వేగంగా జరుగుతుంది. అన్ని త్వరగా సర్వే చేస్తారు. ఎక్కువ సమయం ఇవ్వరు. కావున వారు వచ్చాక అన్ని పత్రాలు రెడీ చేసుకునే కంటే ముందుగానే అన్ని రెడీగా పెట్టుకుంటే మీ సర్వే తొందరగా పూర్తవుతుంది.

దాని వలన అధికారులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా మీ సర్వేని తొందరగా కంప్లీట్ చేస్తారు. వారు కోరిన పత్రాలన్నీ చూపిస్తే లబ్ధిదారులుగా ఎంపిక అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వం వారు చెప్తున్నారు. అభయస్తం కోసం అప్లై చేసుకున్న వారు వారి దగ్గర అడ్రస్ గ్రూపు కలిగి ఉండాలి. అలాగే వారి వయసు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. దీనికోసం ఆధార్ లేదా వయసు నిర్మిత పత్రన్ని చూపించవలసి ఉంటుంది. అదేవిధంగా వార్షిక ఆదాయం 1.15 లక్షలకు మించి ఉండకూడదు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పకుండా రెడీగా ఉంచుకోవాలి. అలాగే అభయస్తం దరఖాస్తులు తోపాటు ఏ ఏ పత్రాలను సబ్మిట్ చేశారు. వాటి ఒరిజినల్ పత్రాలు కూడా రెడీగా పెట్టుకోవాలి..

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి