Electricity Bills : ఈమధ్య ప్రతి ఒక్కటి యూపీఐ పేమెంట్స్ అవ్వడం వల్ల అందరు వాటి ద్వారానే అన్ని పేమెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎలెక్ట్ర్సిటీ బిల్లులను ఎక్కువగా ఆన్ లైన్ లోనే పే చేస్తున్నారు. కరెంట్ ఆఫీఎస్ కు వెళ్లి కరెట్ బిల్లు పే చేసే వారి సంఖ్య చాలా తగ్గింది. ముఖ్యంగా కరోనా టైం లో ఆన్ లైన్ ద్వారానే కరెంట్ బిల్లులు చెల్లించారు. ఐతే ఈమధ్య కరెంట్ బిల్లులను యూపీఐ పేమెంట్స్ ద్వారా చేయడాన్ని రద్దు చేసింది.
తెలంగాణాలో రెండు నెలలుగా కరెంట్ బిల్లులు ఆన్ లైన్ చేయడానికి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. యూపీఐ ద్వారా చేద్దామని అనుకుంటే ఆ చెల్లింపులు నిరాకరిస్తుంది. మొన్నటిదాకా గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే, ఫోన్ పే ద్వారా కరెంట్ బిల్స్ పేమెంట్ చేశారు. యూఈఐ సంస్థలతో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి ముగియడం వల్ల విద్యుత్ సంస్థలు యూపీఐ పేమెంట్స్ తో బిల్లులు తీసుకోవడం ఆపేశారు. రెండు నెలలుగా వినియోగదారులు ఇబ్బంది పడుతూ యూపీఐ ద్వారా కరెంట్ బిల్స్ పే చేయలేకపోతున్నారు.
యూపీఐ ద్వారా కరెంట్ బిల్స్ పేమెంట్ నిలిపేసిన టీ.ఎస్.ఎన్.పీ.డీ.సీ.ఎల్ వెబ్ సైట్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా కరెంట్ బిల్స్ పే చేసే అవకాశం ఇచ్చింది. అయితే వీటిపై చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల పేమెంట్స్ ఆగిపోతున్నాయి. యూపీఐ పేమెంట్స్ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా మాత్రం బిల్లులు పే చేసే అవకాశం లేకుండా పోయింది. ఐతే నెలకోసారి బిల్ పే చేసేందుకు మరో కొత్త యాప్ డౌన్ లోన్ చేయడం అంతగా ఆసక్తి చూపించలేదు.
ఐతే వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరెంట్ బిల్స్ ను మళ్లీ యాప్స్ ద్వారానే చెప్పించేలా టీ.ఎస్.ఎన్.పీ.డీ.సీ.ఎల్ ప్రయత్నిస్తుంది. ఏరియాను బట్టి కొన్ని జిల్లాల్లో ఫోన్ పే, భీం యాప్ ల ద్వారా కరెంట్ బిల్స్ పే చేసే అవకాశం కల్పించారు. భారత్ బిల్ పేమెంట్ సిస్టెం సర్వీస్ తో ఒప్పందం జరిగిందని ఎస్.ఈ గంగాధర్ వెల్లడించారు. వారం లో గూగుల్ పే ద్వారా కూడా కరెంట్ బిల్ పే చేసే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకోవాలని చెప్పారు.
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
This website uses cookies.