
Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!
Eatala Rajendar : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన స్వగ్రామం హుజురాబాద్కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం శామీర్ పేట్ లో హుజురాబాద్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. “వీధి పోరాటాలు నాకు రావు.. స్ట్రెయిట్ ఫైట్ నాకు నచ్చుతుంది. కార్యకర్తల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో నేను లేను” అంటూ తేల్చిచెప్పారు. రాజకీయ అవమానాలను తట్టుకుంటానని.. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని ఆయన భావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు బండి సంజయ్ నువ్వేవడివి అసలు..నీ శక్తి ఏంది నీ స్థాయి ఏంది.. నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది. 2002 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను.. రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసాను, రెండు సార్లు జిల్లా మంత్రిగా పని చేసాను..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడకా అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు.
Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!
“హుజురాబాద్ చైతన్యానికి మారుపేరు. 2021లో భీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాం. ఆ సమయంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నా, వెనక్కి తిప్పుకోలేదు. నా చరిత్ర ప్రజలకు తెలుసు. ఏ పార్టీలో ఉన్నా పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాను. కోవర్టులు ఎక్కడైనా ఉంటారు. వాళ్లపై దృష్టిపెట్టడం లేదు. కార్యకర్తలు కుంగిపోవద్దు. హుజురాబాద్లో ఇప్పటికీ బలమైన బీజెపి కేడర్ ఉంది. నేను వచ్చాకే కరీంనగర్ లోక్సభకు 50 వేల మెజారిటీ వచ్చింది” అని వివరించారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారని, అబద్ధాలపై రాజకీయం నడుపుతున్నారని ఆయన విమర్శించారు. “కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. నాకు అలాంటి రాజకీయం వద్దు. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడతా. ఇకపై పదిరోజులకోసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తల కోసం ఎప్పటికీ వెన్నంటి ఉంటా” అంటూ హామీ ఇచ్చారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుసా మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారని.. అలాంటిది వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు. ఇక నుంచి హుజురాబాద్లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈటల వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
Ration Card : దేశంలోని ప్రతి పౌరుడికి సరసమైన ధరలకు ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ…
Gold and Silver Prices 16 March 2026 : గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన…
Karthika Deepam 2 March 16 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన కొన్ని భారీ ప్రమాదాలు మరియు గిరిజన ప్రాంతాల్లోని మరణాలు రాజకీయంగా…
JOBS in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా…
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
This website uses cookies.