Categories: NewsTelangana

Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!

Eatala Rajendar : బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తన స్వగ్రామం హుజురాబాద్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం శామీర్ పేట్ లో హుజురాబాద్ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. “వీధి పోరాటాలు నాకు రావు.. స్ట్రెయిట్ ఫైట్ నాకు నచ్చుతుంది. కార్యకర్తల రాజకీయ అవసరాలు తీర్చలేనంత నిస్సహాయ స్థితిలో నేను లేను” అంటూ తేల్చిచెప్పారు. రాజకీయ అవమానాలను తట్టుకుంటానని.. ప్రజలు ఎప్పుడూ మోసం చేయరని ఆయన భావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా బండి సంజయ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. అసలు బండి సంజయ్ నువ్వేవడివి అసలు..నీ శక్తి ఏంది నీ స్థాయి ఏంది.. నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది. 2002 నుండి నేను రాజకీయాల్లో ఉన్నాను.. రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పని చేసాను, రెండు సార్లు జిల్లా మంత్రిగా పని చేసాను..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామాలు లేవు. నా చరిత్ర నీకు తక్కువ తెలుసు కొడకా అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు.

Eatala Rajendar : నువ్వేవడివి అసలు.. అంటూ బండి సంజయ్ పై ఈటెల ఫైర్..!

Eatala Rajendar : బండి సంజయ్ నీ శక్తి ఏంది నీ స్థాయి ఏంది..  నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏంది – ఈటెల రాజేందర్

“హుజురాబాద్‌ చైతన్యానికి మారుపేరు. 2021లో భీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చాం. ఆ సమయంలో తీవ్ర అవమానాలను ఎదుర్కొన్నా, వెనక్కి తిప్పుకోలేదు. నా చరిత్ర ప్రజలకు తెలుసు. ఏ పార్టీలో ఉన్నా పూర్తిగా అంకితభావంతో పనిచేస్తాను. కోవర్టులు ఎక్కడైనా ఉంటారు. వాళ్లపై దృష్టిపెట్టడం లేదు. కార్యకర్తలు కుంగిపోవద్దు. హుజురాబాద్‌లో ఇప్పటికీ బలమైన బీజెపి కేడర్ ఉంది. నేను వచ్చాకే కరీంనగర్‌ లోక్‌సభకు 50 వేల మెజారిటీ వచ్చింది” అని వివరించారు.

తాజాగా సోషల్ మీడియా వేదికగా కొందరు కుట్రలు చేస్తున్నారని, అబద్ధాలపై రాజకీయం నడుపుతున్నారని ఆయన విమర్శించారు. “కొందరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. నాకు అలాంటి రాజకీయం వద్దు. నేను ప్రజల నుంచి వచ్చిన వాడిని. సమాజం పట్ల బాధ్యతతో మాట్లాడతా. ఇకపై పదిరోజులకోసారి హుజురాబాద్ వస్తా. కార్యకర్తల కోసం ఎప్పటికీ వెన్నంటి ఉంటా” అంటూ హామీ ఇచ్చారు. రాజకీయాల్లో చిన్న మనస్కులు, కురుసా మనస్తత్వం ఉన్న వాళ్లు ఉంటారని తెలిపారు. వాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని ఉంటారని.. అలాంటిది వారితో యుద్ధం చేయడం కష్టమే కానీ ఎదురెళ్లి నిలబడాలని చెప్పుకొచ్చారు. ఇక నుంచి హుజురాబాద్‌లో ప్రతి మండలానికి ఒక కార్యాలయం ఉంటుందని తెలిపారు. ఈటల వ్యాఖ్యలు ప్రస్తుతం బీజేపీ వర్గాల్లోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

Recent Posts

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

7 minutes ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

2 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

3 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

6 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

8 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

19 hours ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

22 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

1 day ago