CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2025,6:50 pm

CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి శిక్ష ఖరారు చేసింది. ఏ1గా ఉన్న బీవీ శ్రీనివాస్ రెడ్డికి, ఏ2గా ఉన్న మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి, ఏ3 వి.డి. రాజగోపాల్, ఆయన పీఏ అయిన ఏ7 అలీఖాన్‌లకు కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది. అలాగే ఓబులాపురం మైనింగ్ కంపెనీని ఐదో దోషిగా కోర్టు గుర్తించింది.

ఇక తీర్పు సమయంలో జడ్జి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మీరు యావజ్జీవ శిక్షకు కూడా అర్హులే. పదేళ్ల శిక్ష ఎందుకు విధించకూడదు?” అని వ్యాఖ్యానించారు. దేశ ఆస్తులను దోచుకుంటూ వ్యక్తిగత లాభాల కోసం చట్టాలను అతిక్రమించడం సమాజానికి హానికరం అని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుతో అక్రమ మైనింగ్ కేసులపై చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో మరోసారి తేలింది.

CBI Court దోషిగా మైనింగ్ రాజుహైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

CBI Court : దోషిగా మైనింగ్ రాజు..హైదరాబాద్ సీబీఐ కోర్టు సంచలన తీర్పు

శిక్ష ఖరారైన తర్వాత వారి చేతిలో ఎలాంటి బెయిల్ లేని పరిస్థితిలో పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టారు. వారిని జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే వీరు ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌కి వెళ్లే అవకాశాన్ని కోర్టు ఇంకా స్పష్టం చేయలేదు. ఈ కేసు తీర్పు న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించగలదని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది