Anganwadis : అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. జీతాలు పెంచేశారుగా.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anganwadis : అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. జీతాలు పెంచేశారుగా.!

 Authored By ramu | The Telugu News | Updated on :7 May 2025,11:15 am

ప్రధానాంశాలు:

  •  Anganwadis : అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం.. జీతాలు పెంచేశారుగా.!

Anganwadis : అంగన్‌వాడీ టీచర్లుకు తెలంగాణ Telangana Govr ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారికి వేతలను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంటుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.. ఇందులో భాగంగా మినీ అంగన్‌వాడీ టీచర్లను అంగన్‌వాడీ టీచర్‌గా ప్రమోట్ చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లు ఇకపై అంగన్‌వాడీ టీచర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్‌వాడీ అనే తేడా ఉండదు.

Anganwadis అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం జీతాలు పెంచేశారుగా

Anganwadis : అంగ‌న్‌వాడీల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. జీతాలు పెంచేశారుగా.!

Anganwadis పెరిగిన జీతాలు..

కాగా, గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ.7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ.13,650 జీతం అందనుంది. పెంచిన వేతనం ఏప్రిల్ నెల నుంచి అకౌంట్లలో జమ కానుంది. అయితే, శాలరీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 అంగన్‌వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు జీతం పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్నికి వారు కృతజ్ఙతలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,989 మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇకపై అంగన్వాడి టీచర్లుగా భాద్యతలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో రాష్ట్రంలో ఇకపై మినీ, మెయిన్ అంగన్వాడి అనే తేడా ఉండదు. గతంలో మినీ అంగన్వాడీలకు రూ. 7800 జీతం మాత్రమే ఇస్తుండగా.. తాజా నిర్ణయంతో వారికి రూ. 13,650 జీతం అందనుంది. పెంచిన ఈ జీతం ఏప్రిల్ నెల నుంచి అంగవాడీలకు అందించనున్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది