Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 6 March 2025, 11:40 am
  •  Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

Half-day schools : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా మార్చి 15వ తేదీ నుంచి ఒంటి పూట బ‌డులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పాఠ‌శాల విద్యా శాఖ తెలిపింది. ఈ ఏడాది అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటాయని, హైదరాబాద్‌లో 36 డిగ్రీల సెల్సియస్, 38 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా వాతావ‌ర‌ణ శాఖ అధికారులు అంచ‌నా వేశారు.

Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

Half Day Schools : తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒకపూట బడులు

మార్చి నెలలోనే సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నందున, హాఫ్-డే పాఠశాలలను ప్రారంభించేందుకు స‌మాయ‌త్త‌మ‌య్యారు. రంజాన్ మాసాన్ని పుర‌స్క‌రించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉర్దూ మీడియం పాఠశాలలకు, సమాంతర మీడియం పాఠశాలల ఉర్దూ మీడియం విభాగాలకు, DIETల ఉర్దూ మీడియం విభాగాలకు హాఫ్-డే పాఠశాలలను ఈ నెల 2 నుండే ప్రకటించింది.

పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తరగతులు ముగిసిన తర్వాత అందించబడుతుంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి