CM Revanth Reddy : కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ .. అధికారులు, సిబ్బంది సీరియ‌స్ వార్నింగ్‌.. సీఎం రేవంత్ రెడ్డి..!

CM Revanth Reddy : రాష్ట్రంలో ఎక్కడైనా అకారణంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం కలిగితే బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై ముఖ్యమంత్రి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు, విద్యుత్తుపై దుష్ప్రచారం చేసేందుకు కొందరు కుట్రలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అటువంటి అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. గ‌తంతో పోల్చితే విద్యుత్ స‌ర‌ఫ‌రా పెంచినప్పటికీ, కోత‌లు పెడుతున్నారంటూ జరుగుతున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీదేనని విద్యుత్తు శాఖ అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.

స‌చివాల‌యంలో గృహ‌జ్యోతి, రూ.500కే సిలిండ‌ర్ పథకాలపై స‌మీక్ష‌కు ముందు ముఖ్య‌మంత్రి విద్యుత్ కోత‌ల‌పై సాగుతున్న ప్ర‌చారంపై అధికారుల‌ను ప్ర‌శ్నించారు. గ‌తేడాదితో పోల్చితే గ‌త రెండు నెల‌ల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రా ఎక్కువ‌గా చేసినట్లు ట్రాన్స్ కో జెన్​ కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు. ఇటీవ‌ల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల ప‌రిధిలో కొంత సేపు విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని తెలిపారు. దానికి కార‌ణాలు ఏమిట‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు స‌రి చూసుకుంటూ ఉండాల‌ని, అలా చూసుకోక‌పోవ‌డంతో స‌మ‌స్య త‌లెత్తింద‌ని అధికారులు తెలియ‌జేశారు. అలా నిర్ల‌క్ష్యంగా, అజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించే అధికారులు, సిబ్బందిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏవైనా మ‌ర‌మ్మ‌తులు, ఇత‌ర అంశాల‌కు స‌ర‌ఫ‌రా నిలిపివేయాల్సి వ‌స్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల ప‌రిధిలోని వినియోగ‌దారుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచించారు. గ‌త ప్ర‌భుత్వ‌ హ‌యాంలో నియ‌మితులైన కొంద‌రు క్షేత్ర‌స్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తెచ్చేందుకు ఉద్దేశ్య‌పూర్వ‌కంగా కోత‌లు పెడుతున్నార‌నే స‌మ‌చారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు.

ఎక్క‌డైనా అయిదు నిమిషాల‌కు మించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోతే అందుకు గ‌ల కార‌ణాల‌పై వెంట‌నే స‌మీక్షించుకోవాలని చెప్పారు. సాంకేతిక‌, ప్ర‌కృతిప‌ర‌మైన కార‌ణాలు మిన‌హా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా కోత‌ల‌కు కార‌ణ‌మైతే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. రాష్ట్రంలో డిమాండ్ కు అనుగుణంగా సరిపడేంత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విద్యుత్తు అవసరం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ పీక్ సీజన్కు సరిపడేంత విద్యుత్తును అందించే కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. ఫిబ్రవరిలో ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా అయింది. గత ఏడాది అదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా జరిగింది. నిరుడు జనవరిలో 230.54 మిలియన్ యూనిట్లు సరఫరా కాగా, ఈ ఏడాది జనవరిలో అంతకంటే ఎక్కువగా 243.12 మిలియన్ యూనిట్లు సరఫరా అయింది.

Share

Recent Posts

Actress : ప్ర‌కంప‌నలు పుట్టిస్తున్న హోంమంత్రి హీరోయిన్ లీకులు.. బిగ్ గిఫ్ట్‌లు..!

Actress : బంగారం స్మగ్లింగ్‌ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…

4 hours ago

Woman : ప్రియుడితో అడ్డంగా దొరికిన మ‌హిళ‌.. భ‌ర్త ఇచ్చిన ప‌నిష్మెంట్‌పై ప్ర‌శంస‌లు

Woman  : ఈ రోజుల్లో వివాహేత‌ర సంబంధాలు విచ్చ‌ల‌విడిగా సాగుతున్నాయి. భ‌ర్త‌ల‌ని మ‌బ్బిబెట్టి ప్రియుడితో జ‌ల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…

5 hours ago

Heroine : వన్ నైట్ కోసం రూ.35 లక్షలు తీసుకుంటున్న హీరోయిన్

Heroine  :  ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్…

6 hours ago

KCR : కేసీఆర్ రూట్ లో ట్రంప్..!

KCR  : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కేసీఆర్ కిట్' పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో…

7 hours ago

TTD Good News : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అందుబాటులో ఏఐ అధారిత సేవలు..!

Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ (…

8 hours ago

Actress : నా బాడీ చూసి నేనే టెంప్ట్ అయిపోతానంటున్నఅందాల భామ‌..!

Actress  : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్…

9 hours ago

Kodali Nani : నానిని ఎక్కడికి వెళ్లకుండా చేసిన టీడీపీ సర్కార్..!

Kodali Nani  : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.…

10 hours ago

Mumbai Indians : ముంబైని ప్లే ఆఫ్స్ వ‌ర‌కు తీసుకొచ్చింది ఆ ఇద్ద‌రే..!

Mumbai Indians : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేర‌డం అద్భుతం.…

11 hours ago